ఈ మధ్యకాలంలో రాకేష్ మాస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా  మారిపోతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు రాకేష్ మాస్టర్ కి సంబంధించిన వీడియోలు వస్తున్నాయి. హీరోలు విలన్లు అనే తేడా లేకుండా అందరి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు రాకేష్ మాస్టర్. ఇక రాకేష్ మాస్టర్ చేస్తున్న ఎన్నో వ్యాఖ్యలు వివాదాస్పదంగా కూడా మారిపోతున్నాయి . ఇక అటు రాజకీయ నాయకులపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు రాకేష్ మాస్టర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రాకేష్ మాస్టర్ కి సంబంధించిన వీడియోలు దర్శనమిస్తున్నాయి. అయితే హీరోయిన్ మాధవి లత పై కూడా రాకేష్ మాస్టర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

 


 తాజాగా దీనిపై స్పందించిన హీరోయిన్ మాధవి లత ఆగ్రహం వ్యక్తం చేసింది. రాకేష్ మాస్టర్  ఎవరో తనకు తెలియదు అంటూ పేర్కొన్న మాధవిలత... అతను చేసిన  వ్యాఖ్యలు మాత్రం తనను ఎంతగానో బాధించాయి అంటూ చెప్పుకొచ్చింది. తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో న్యాయపరంగా ముందుగా వెళ్తాను అని తెలిపింది. రాకేష్ మాస్టర్ చేసిన అనుచిత వాక్యాలకు సంబంధించి ఉపేక్షించేది లేదని... రాకేష్ మాస్టర్ ను  పోలీసు కోర్టు మెట్లు ఎక్కిస్తాను  అంటూ హెచ్చరించింది. 

 


 రాకేష్ మాస్టర్ పై పరువు నష్టం దావా వేయనున్నట్లు తెలిపింది మాధవిలత. అయితే గత కొంతకాలంగా రాకేష్ మాస్టర్ ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎన్ని విమర్శలు  వచ్చినప్పటికీ రాకేష్ మాస్టర్ మాత్రం తన తీరు మార్చుకోవటం లేదు . దీంతో కేవలం కొంతమంది మాత్రమే కాదు ఇండస్ట్రీ మొత్తం ప్రస్తుతం రాకేష్ మాస్టర్ తీరు  పై కాస్త గుర్రు గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీరెడ్డిపై రాకేష్ మాస్టర్ అనుచిత వ్యాఖ్యలు చేయగా దానికి బదులుగా శ్రీ రెడ్డి ఏకంగా లీగల్ నోటీసులు పంపింది రాకేష్ మాస్టర్ కి . ఇక ప్రస్తుతం హీరోయిన్ మాధవి లత కూడా అదే మార్గంలో వెళ్లనున్నట్లు తెలుస్తుంది మరి ఈ నోటీసులపై రాకేష్ మాస్టర్ ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: