కరోనా మహమ్మారి బాలీవుడ్ అగ్ర నిర్మాతలను భయపెడుతోంది. ఆల్ రెడీ ఓ నిర్మాత క్వారంటైన్ కు వెళ్లగా.. మరో అగ్ర నిర్మాత కరణ్ జోహార్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాడు. ఆయన ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని కరణ్ స్వయంగా ప్రకటించారు. 

 

దర్శక, నిర్మాత కరణ్ జోహార్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. ఆయన ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపించడంలో.. వారిని ఇంట్లోనే ఓ గదిలో క్వారంటైన్ చేశారు. కరణ్ జోహార్ తో పాటు.. ఇంట్లో పనిచేస్తున్న మిగతా సిబ్బందికి.. కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రిపోర్ట్ రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇంట్లో ఒకరికి కరోనా వస్తే.. అందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలి కాబట్టి.. ప్రస్తుతం అందరూ స్వీయ నిర్బంధంలోకి ఉన్నారు. 

 

కరణ్ జోహార్ ప్రస్తుతం రెండు భారీ సిినిమాలు సూర్యవంశ్.. బ్రహ్మాస్త్ర నిర్మిస్తున్నాడు. సూర్య వంశ్ లో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. అమితాబ్, రణ్ బీర్ కపూర్, నాగార్జున, అలియా తదితరులతో మల్టీస్టారర్ మూవీగా బ్రహ్మాస్త్ర తెరకెక్కుతోంది.మరోవైపు విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ నటిస్తున్న సినిమాను హిందీలో నిర్మిస్తున్నాడు. 

 

ఆ మధ్య బోనీకపూర్ ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తులకు కరోనా రావడంతో.. బోనీ కపూర్ తో పాటు.. కుమార్తెలు జాన్వీకపూర్, ఖుషీకపూర్ కూడా ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తుల కారణంగా ఇద్దరు నిర్మాతలు నిర్బంధంలోకి వెళ్లారు. చాలామంది హీరోయిన్స్ పనివాళ్లను మాన్పించేసి.. తామే ఇంటిపని.. వంటపని చేసుకుంటున్నారు. ఈ మధ్య కత్రినా కైఫ్ కూడా ఆ మధ్య గిన్నెలు తోముతూ కనిపించింది.

 

ఎప్పుడూ సినిమా షూటింగ్ లతో బిజీబిజీగా గడిపే నటీనటులు ఇపుడు సొంతపనుల్లో నిమగ్నమయ్యారు. ఎలాంటి వారినైనా కరోనా ఇంటికే పరిమితం చేసింది. ఎపుడూ చేయని పనులు చేయిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: