తెలుగు చిత్ర పరిశ్రమలో పరుచూరి బ్రదర్స్ కి ఎంత గుర్తింపు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా రచయితగా నటుడిగా వీరికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది తెలుగు చిత్ర పరిశ్రమలో. ముఖ్యంగా పరుచూరి  గోపాలకృష్ణ  ఎన్నో సినిమాల్లో  ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇప్పటి వరకు ఆయన కథారచయితగా గొప్ప గొప్ప సినిమాలకు కథలను అందించడమే కాదు... ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇక టాలీవుడ్ లో  మైలురాళ్లలాంటి  సినిమాలకు కథ మాటలు అందించి మరింత గుర్తింపు సంపాదించారు. అందుకే పరుచూరి గోపాలకృష్ణ కు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. 

 

 అయితే మామూలుగా సెలబ్రిటీలు ఎవరైనా ఏదైనా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు అంటే అది క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటుంది  అన్న విషయం తెలిసిందే. తాజాగా రచయిత నటుడు పరుచూరి గోపాలకృష్ణ తన భార్య కు సంబంధించి ఓ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈరోజు పరుచూరి గోపాలకృష్ణ పెళ్లిరోజు. పెళ్లి తర్వాత తన భార్యతో తన అనుబంధం ఎలా సాగింది అని చెబుతూ ఒక పోస్ట్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు పరుచూరి గోపాలకృష్ణ. కాగా ప్రస్తుతం ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 

 


 తన వివాహం తర్వాత వైవాహిక జీవితంలో కష్టనష్టాల్లో  తన భార్య ఎంత తోడుగా నిలిచింది అనేది తన పోస్టులో చెప్పుకొచ్చారు పరుచూరి గోపాలకృష్ణ. ఒకసారి ఆయన మాటల్లోనే...యాభైఏళ్ళ క్రితం విజయలక్ష్మీ నువ్వు  అర్ధాంగిగా నాజీవితంలోకి ఈరోజే  అడుగుపెట్టింది.ముత్యాలలాంటి  ముగ్గురుకుమార్తెలు ,రత్నాలవంటి ముగ్గురుమనుమరాళ్ళు,వజ్రాలవంటి ఇద్దరుమనమళ్లు, ఉపాధ్యాయజీవితంలో ,సినిమా ప్రపంచంలో అనేకఆటుపోట్లు! చిరునవ్వుతోనే అడుగులువేస్తూ రావడానికినువ్వేకారణం.సుఖీభవ అంటూ ఒక పోస్టు పెట్టారు పరుచూరి గోపాలకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: