టాలీవుడ్ లో మిర్చి సినిమా ఒక రేంజ్ లో సంచలనం అనే సంగతి తెలిసిందే. ప్రభాస్ కెరీర్ లో వచ్చిన ఈ సినిమా ఒక రేంజ్ లో హిట్ అయింది. ఈ సినిమాలో కథ ఈ సినిమాలో హీరో ప్రభాస్ నటన అన్నీ కూడా ఒక రేంజ్ లో సంచలనం అనే సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో చాలా వరకు కూడా వివాదాలు కూడా ఉన్నాయి అని అంటూ ఉంటారు. రాయలసీమ సహా పల్నాడు ప్రాంతానికి చెందిన వారు విమర్శలు చేసారు. తమ ప్రాంతాలను అవమానించే విధంగా ఈ సినిమా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేసారు కూడా. 

 

సినిమా విషయంలో దర్శకుడు కొరటాల శివ ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు అని తమ ప్రాంతాన్ని ఫ్యాక్షన్ ప్రాంతంగా చూపించి అవమానించారు అని ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా సినిమాను నిలిపివేయాలి అనే డిమాండ్ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చాలా సన్నివేశాల విషయంలో మాటల విషయంలో దాదాపుగా అదే వివాదం వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత చాలా వరకు ప్రభాస్ వివాదాలు లేకుండా సినిమాలు చేసాడు అనే సంగతి తెలిసిందే. ఇప్పటికి అతను సినిమాల విషయంలో దాదాప్పుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. 

 

ఈ సినిమాలో అతని నటనకు చాల మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా అప్పుడు వంద కోట్ల వసూళ్లు సాధించిన తొలి తెలుగు సినిమాగా కూడా నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు టీవీ లో వచ్చినా సరే జనాలు చూస్తూ ఉంటారు. ఈ సినిమాలో చాలా సన్నివేశాలు మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. అదే ఈ సినిమాకు చాలా వరకు బలం అయింది అని అంటూ ఉంటారు. ఇప్పుడు  ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: