లాక్ డౌన్ ఎప్పుడైతే తీసేశారో... అప్పుడు అందరికంటే ముందుగా దేశాలు దాటిపోయింది బాలీవుడ్  తారలే. అప్పటివరకు... రెక్కలు తెగిన పక్షుల్లా విహార వేదనతో బాధపడిన తారలు ..ఒక్కసారిగా చెలరేగిపోయారు.అక్కడితో ఊరుకోకుండా తమ ఎంజాయ్ మెంట్ ను ...సోషల్ మీడియాలో  షేర్ చేసి అందరికీ వైరల్ అయ్యేలా చేశారు.

తారలు షూటింగ్ లకు గ్యాప్ వస్తే  టూరిజాన్ని లైక్ చేసేవారు. వీకెండ్స్ లో లాంగ్ డ్రైవ్ లకు వెళ్లేవారు..ఈ కరోనా టైమ్లో అన్నీ అదుపు చేసుకుని ఇళ్లలో కూర్చున్నారు.కరోనా లాక్ డౌన్ స్టార్ట్ అయిన మూడు నెలలు తర్వాత టిక్ టాక్ ,హలో యాప్ లు బంద్ కావడంతో మొత్తానికి జుట్టులు పీక్కున్నారు. ఎప్పుడైతే అన్ లాక్ పిరియడ్ వచ్చిందే అంతే తారలంతా రెక్కలు తొడుక్కుని సుదూరాలకు వలస పక్షులు ఎగిరినట్లు ఎగిరిపోయారు.

బాలీవుడ్ ఆర్టిస్టులలో  సైఫ్‌ అలీ ఖాన్‌ కుమార్తె సారా లాక్ డౌన్లో ఇంట్లోనే ఉన్నారు. బ్రదర్ ఇబ్రహీమ్‌తో కలిసి వర్కవుట్‌ వీడియోలు పోస్ట్‌ చేస్తూ... ఉన్నంతలో సరదాగా గడిపింది. ఆగస్టులో వచ్చిన తన బర్త్ డేకు  ఫ్రెండ్స్ తో కలిసి గోవా టూర్ వేసింది. అక్కడి చల్లటి సముద్ర వాతావరణాన్ని ఎంతో చక్కగా ఆస్వాదించింది.

బీచ్ లో బికినీ వేసుకుని స్విమ్మింగ్ పూల్లో జలకాలాడింది.అక్కడితో ఊరుకోకుండా అన్ లాక్ లో తన ప్రతి జాయ్ ఫుల్ మూమెంట్ ను సోషల్ మీడియాలో పంచుకుంది. టాప్ హీరోయిన్స్ ను మించిన తారలా... సారా అలీఖాన్ బిహేవ్ చేసింది. నెటిజన్లు కూడా సారా జాలీ ట్రిప్ ను ఆస్వాదించారు.

మొత్తానికి కరోనా ఏమని మన దేశంలోని ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి చాలామందికి మనశ్సాంతి లేకుండా పోయింది. కొందరు మాత్రం లాక్ డౌన్ టైమ్ ను కరెక్ట్ గా వినియోగించుకున్నారు. మరికొందరు బోర్ గా ఫీల్ అయ్యారు. సినీ స్టార్స్ అయితే ఇంటికే పరిమితమై.. ఇంటి పనులను చూసుకున్నారు. మరికొందరు వ్యవసాయ పనులను ఆసక్తిగా చేశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా తమకున్న సమయాన్ని చక్కగా ప్లాన్ చేసుకున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: