ఒకప్పుడు సినీతారలు కేవలం సినిమాలు చేసుకుంటూ నాలుగు రాళ్లు వెనకేసుకునేవాళ్ళు. సినిమాల్లో నటించి..ఆ వచ్చిన డబ్బులతో కార్లు, బంగ్లాలు కొంటూ తమ ఆస్తులను కొంత వెనక్కి వేసుకునేవారు. కానీ ఇప్పటితరం సినీ నటులు అలా కాదు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒకప్పటి నటులు సినిమాల దగ్గరే ఆగిపోయారు. మరి ఇప్పుడు ప్రతీ ఒక్క స్టార్ సెలెబ్రిటీ తమ క్రేజ్ తో ఇతర వ్యాపార రంగాల్లో అడుగులు వేసి.. కొన్ని కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు. అటు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వ్యాపారాల్లో కూడా రాణిస్తున్నారు.  సినీ నటులకు వ్యాపార నిర్వహించడం మరింత సులువు. ఎందుకంటే వాళ్లకు ఉన్న క్రేజ్ కారణంగా వారు తయారుచేసిన ఉత్పత్తులకు పెద్దగా ప్రచారం అవసరం ఉండదు.

ఎందుకంటే వారి బ్రాండ్లకు వాళ్లే బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతారు. సినీ నటుల వ్యాపారాలపై ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఉంటుంది కాబట్టి.. ఈ రంగంలో వారు విజయం సాధించడం సులువుగానే ఉంటుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ' బీయింగ్ హ్యూమన్' పేరుతో పలు ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.తెలుగులో రానా మహేష్ బాబు రకుల్ ప్రీత్ సింగ్ తరుణ్ మంచు విష్ణు మనోజ్ రామ్ చరణ్ సమంత నాగ చైతన్య పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టారు.ఇక హీరో విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ పేరుతో దుస్తుల వ్యాపారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ చిన్నపిల్లల దుస్తుల వ్యాపారం ప్రారంభించారు.

 ఇందులో పెట్టుబడులకు కూడా ఆమె ఆహ్వానం పలుకుతోంది. తాను ప్రారంభించిన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. అలియాభట్ 'ఎడ్ ఏ మమ్మా' పేరుతో చిన్నపిల్లల దుస్తుల వ్యాపారం నిర్వహిస్తోంది. విజయ్ దేవరకొండ లాగా దుస్తుల వ్యాపారంలో క్లిక్ అయ్యేందుకు ఆమె ఫోకస్ పెట్టింది.దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ అమ్మడు తన ప్రమోషన్ ని కూడా మొదలు పెట్టిందట. ఈ బిజినెస్ కనుక సక్సెస్ అయితే.. మన ఆలియా భట్ రెండు చేతులా గట్టిగా సంపాదించడం ఖాయంగా కనిపిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: