పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ ల తొలి కాంబినేషన్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న కోర్టు డ్రామా మూవీ వకీల్ సాబ్. శృతి హాసన్ పవన్ కళ్యాణ్ కి భార్యగా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, మురళి శర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా థమన్ మ్యూజిక్ ని పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ లు కలిసి సంయుక్తంగా ఎంతో భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక లాయర్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాకి సంబంధించి ఇటీవల బయటకు వచ్చిన మగువా మగువా లిరికల్ సాంగ్, అలానే ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లు రెండూ కూడా ప్రేక్షకాభిమానులను ఎంతో ఆకట్టుకుని సినిమాపై వారిలో భారీ స్థాయిలో అంచనాలు పెంచిన విషయం తెల్సిందే. ఇకపోతే ఈ సినిమాని ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ కొట్టిన పింక్ మూవీ కి తెలుగు రీమేక్ గా తీస్తున్నారు. మన తెలుగు నేటివిటీ కి తగ్గట్లుగా ఈ కథలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసిన దర్శకుడు వేణు శ్రీరామ్, దీనిని అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ని కూడా ఎంతో అలరించేలా తీస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే పవన్ నుండి సినిమా వచ్చి దాదాపుగా మూడేళ్లు అవుతుండడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ వకీల్ సాబ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే వారందరికీ మంచి బూస్టప్ ఇస్తూ ప్రస్తుతం వకీల్ సాబ్ కి సంబంధించిన ఒక వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుందని, అలానే సినిమాకి సంబదించిన పూర్తి వివరాలను అతి త్వరలో యూనిట్ ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రేక్షకులకు తెలియచేయనుందని అంటున్నారు. అదే సమయంలో టీజర్, ట్రైలర్ తో పాటు సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందట. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే ఇది నిజంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి పండుగ వార్తే అని చెప్పకతప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: