తనకు మహేష్ బాబు చిత్రాల్లో బాగా ఇష్టమైన మూవీ ఇదేనంటూ ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ చిత్రానికి చెందిన వారందరి పేర్లను ఆమె తన పోస్ట్లో ప్రస్తావించారు. అయితే చిత్ర నిర్మాత యం.యస్. రాజు పేరును ప్రస్తావించడం మాత్రం మర్చిపోయారు. దీంతో ఈ వార్త ఒక్క సారిగా వైరల్ అయిపోయింది. చిత్రాన్ని రూపొందించిన వ్యక్తి పేరు పెట్టకపోవడం ఏంటంటూ నెటిజన్లు మండిపడ్డారు. అలా ఈ వార్త యం.యస్. రాజు దాకా వెళ్లిపోయింది. ఆయన దీనిపై స్పందిస్తూ.. ‘తప్పులు జరుగుతుంటాయి లే బాబు.
నమ్రత గారు 18 ఏళ్ల ఒక్కడు అనే పోస్ట్లో నా పేరును ప్రస్తావించడం మర్చిపోయారు. కానీ ఈ సినిమా ఆమె ఫేవరేట్ క్లాసిక్ అని చెప్పడం నాకు ఎంతో ఆనందంగా ఉంది’అంటూ మహేష్ బాబు సోషల్ మీడియా ఖాతాను జత చేస్తూ ఈ పోస్ట్ పెట్టారు. ఇక నమ్రత అప్పటికే తన తప్పును సరిదిద్దుకుని తన ఖాతాలో యం.యస్. రాజు పేరును కూడా జత చేసింది. కాగా.. ఒక్కడు చిత్రానికి మ్యూజిక్ బ్రహ్మ మణి శర్మ సంగీతాన్ని అందించారు. ఒక్కడు చిత్ర పాటలు ఇప్పుడు వినిపించినా ప్రతి ఒక్కరు వింటూనే ఉంటారంటే అది మణి శర్య మ్యాజిక్ అనే చెప్పుకోవాలి.