టాలీవుడ్ హీరో తేజ సజ్జా, మంచు మనోజ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం మిరాయ్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ ఘట్టమైన దర్శకత్వంలో తెరకెక్కించగా ఇందులో అలనాటి హీరోయిన్ శ్రియ కీలకమైన పాత్రలో నటించింది. హీరోయిన్ గా రితిక నాయర్ నటించగా మంచి పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా అతి తక్కువ బడ్జెట్ తో విడుదలై భారీ కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలలో ఈ ఏడాది (2025) ఈ సినిమా కూడా నిలిచింది. వాటి గురించి చూద్దాం.


తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభం:
మిరాయ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన నిర్మించారు. ఈ సినిమా కోసం రూ .60 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత రూ.200 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసి ఉంటారనేలా కనిపించింది. కార్తీక్ ఘట్టమనేని సినిమా విజువల్స్ ను చాలా బలంగానే ప్రజెంట్ చేశారు. కెమెరా షాట్స్, యాక్షన్ బ్లాక్, VFX అన్నీ కూడా అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి హైలైట్ గా తేజ సజ్జా, మంచు మనోజ్ మధ్య జరిగే సీన్స్ ఉంటాయి. పాన్ ఇండియా లెవెల్లో చాలా గ్రాండ్ గా ఈ సినిమా సక్సెస్ అయ్యింది. మిరాయ్ చిత్రంలో రాముడు సీన్ ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయి. పక్షి లాగా వచ్చే సీన్ అద్భుతంగా తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే రూ.147 నుంచి 150 కోట్ల వరకు రాబట్టింది. ఇండియాలో ఒక్కటే రూ. 98 నుంచి రూ .108 కోట్లు రాబట్టింది . అలాగే ఓటీటి హక్కులు కూడా భారీ ధరకే అమ్ముడుపోయాయి.


నటీనటుల రెమ్యూనరేషన్:
హనుమాన్ సినిమా సమయంలోనే మాట ఇవ్వడంతో తేజ సజ్జా రెమ్యూనరేషన్  ఈ సినిమాకి రూ. 2 కోట్లు తీసుకున్నారట. అలాగే శ్రియ రూ. 2 కోట్లు, హీరోయిన్గా నటించిన రితిక నాయర్ రూ. 50 లక్షలు, మంచు మనోజ్ రూ. 3 నుంచి 5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

మిరాయ్ సినిమా తక్కువ బడ్జెట్ తో అద్భుతమైన గ్రాఫిక్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. తక్కువ బడ్జెట్ తో కూడా సినిమాలు తీయచ్చని నిరూపించారు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని.

మరింత సమాచారం తెలుసుకోండి: