ఈటీవీ లో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో 'ఢీ' కి ఎంతగానో  క్రేజ్  ఉంది అన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల  నుంచి ఎంతో విజయవంతంగా కొనసాగుతూ వస్తున్నది. ఈ షో ఎంతో మంది డాన్సర్లకు  లైఫ్ ఇచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అంతే కాకుండా ఎంతో మంది 'ఢీ' షో ద్వారా డాన్స్ మాస్టర్ లుగా మారారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ డాన్స్ మాస్టర్స్  గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లో కూడా 'ఢీ' నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.  ఇక ప్రతి వారం అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ తో  'ఢీ' షో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ ఉంది.



 అయితే 'ఢీ' షో లో భాగంగా ఎంతోమంది లేడీ కంటెస్టెంట్ కూడా ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే 'ఢీ' షో లోని కొంతమంది లేడీ కంటెస్టెంట్, మాస్టర్లు ఈటీవీలో సుమా వ్యాఖ్యాతగా వ్యవహరించే  క్యాష్ షో లో గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక తమదైన డాన్స్ లతో.. అదరగొట్టారు. అదే సమయంలో కామెడీ పంచులతో  ఎంటర్టైన్మెంట్ పంచారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవలే విడుదల కాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా క్యాష్ షో కి వచ్చిన గెస్ట్ లకు ఆసక్తికర ప్రశ్నలు అడుగుతు.. ఇబ్బంది పెడుతూ ఉంటుంది సుమా అన్న విషయం తెలిసిందే.



 ఇక ఇటీవలే క్యాష్ షో లోకి గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్, మాస్టర్స్  ని ఒక ఆసక్తికర ప్రశ్న అడిగింది యాంకర్ సుమ. ఇక సుమ అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మాస్టర్స్  అందరూ తడబడి పోయారు. కొరియోగ్రాఫర్ కి కంటెస్టెంట్స్ కి మధ్య ఎఫైర్స్ జరగడం వల్ల కొన్ని పోయాయి.. ఇది నిజమేనా అంటూ యాంకర్ సుమ ప్రశ్న అడుగుతుంది.  దీంతో అక్కడ ఉన్న అందరూ మాస్టర్స్  షాక్ అవుతారు. అయితే ఇప్పటి వరకు తమకు ఓన్లీ అబ్బాయిలు  కంటెస్టెంట్స్ గా దొరికారని అమ్మాయిలు ఎవరు కూడా కంటెస్టెంట్ గా దొరకలేదు అంటూ అక్కడున్న డాన్స్ మాస్టర్స్  చెబుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: