తెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరో నాగశౌర్య తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఛలో, ఉహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇటీవల హీరోయిన్ అక్కినేని సమంత నటించిన ఓ బేబి సినిమాలో కీలక పాత్రలో నటించాడు ఈ యంగ్ హీరో.

‘అమ్మ..’ తన ప్రేమకు ప్రపంచంలో మరేదీ సాటిరాదు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనకు జన్మనిస్తుంది. అందుకే.. తల్లిపై తమకున్న ప్రేమను అందరూ తమదైన రీతిలో ప్రకటిస్తుంటారు. తాజాగా.. యంగ్ హీరో నాగశౌర్య కూడా అమ్మకు స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పాడు. ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొటో షేర్ చేశాడు శౌర్య. ఇందులో తల్లికి బర్త్ డే కేక్ తినిపిస్తున్నాడు బుల్లి శౌర్య. చిరు నవ్వులు చిందిస్తున్న తల్లికి కేక్ ఎలా తినాలో నేర్పిస్తున్నాడా? అన్నట్టుగా ఉందీ ఫొటో. దీనికి భావోద్వేగమైన కామెంట్ కూడా జోడించాడు. ‘అమ్మా.. నేను బతికున్నదే నీకోసం. హ్యాపీ బర్త్ డే అమ్మా’ అంటూ పోస్ట్ చేశాడు శౌర్య. ఈ చిత్రం ప్రస్తుతం వైరల్ అవుతోంది.

కాగా.. సినిమాల విషయానికి వస్తే శౌర్య కెరీర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. ప్రస్తుతం ‘లక్ష్య’ మూవీ చేస్తూనే.. మరోవైపు ‘వరుడు కావలెను’ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలను ఏకకాలంలో ఫినిష్ చేసేందుకు చూస్తున్నాడు. అయితే.. ఇవి కంప్లీట్ కాకుండానే మరో సినిమాను అనౌన్స్ చేశాడు శౌర్య. కొత్త దర్శకుడు రాజేంద్రతో  సినిమా చేయబోతున్నాడు. ‘పోలీస్ వారి హెచ్చరిక’ పేరుతో ఈ మూవీ రూపొందనుంది. మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభం కానునంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మహేష్ ఎస్ కొనేరు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: