ప్రముఖ భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా.. తమిళ  హీరో విష్ణు విశాల్  ఇద్దరూ కలిసి ఒక ఇంటివారయ్యారు..ఇక జ్వాలా గుత్తాకు కు ఇది రెండో పెళ్లి అన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో క్రీడాకారుడు చేతన్ ఆనంద్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.2005  లో వీరి వివాహం జరిగింది.. అయితే కొన్ని అనుకోని కారణాలవల్ల 2011లో విడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి తన కంటే ఓ సంవత్సరం చిన్నవాడైన హీరో విష్ణు విశాల్ తో డేటింగ్ మొదలు పెట్టింది జ్వాలా గుత్తా..

ఆ తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కూడా తెలియజేశారు. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.ఇన్ని రోజులుగా సోషల్ మీడియాలో సందడి చేస్తూ వచ్చిన ఈ జంట గురువారం- 22 -2021 న  పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. అంతేకాకుండా పెళ్లి బట్టల్లో కుందనపు బొమ్మలా కనిపించింది.

బ్యాట్మెంటన్ ఆడుతున్న సమయంలో ఈమె ఎంతోమంది కుర్రకారుకి  నిద్ర లేకుండా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అంతలా తన అందంతోనే కాదు ఆట తో కూడా అందరిని మైమరిపింపచేసేది. అయితే ఈమె అందం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. తాజాగా మెహందీ ఫంక్షన్ లో చాలా గ్లామర్ గా రెడీ అయ్యి కనిపించింది. పెళ్లి కూతురు డ్రెస్ లో  ఎంతో ఉత్సాహంతో ఫోటోలకు ఫోజులు ఇస్తూ కనిపించింది. ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి ..

ఇక వీరి వివాహానికి తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్  హాజరై , నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని , పెళ్లిని  నిరాడంబరంగా ,అత్యంత సన్నిహితుల సమక్షంలో నే  వీరు పెళ్లి చేసుకోవడం గమనార్హం.. ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితుల్లో కూడా వీరిద్దరూ ఒక ఇంటి వారయ్యారు.. ఇక అభిమానులకు ఈ విషయం ఒకింత ఊరటనిచ్చింది.. ఇక అభిమానులు కూడా వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: