అర్జున్ రెడ్డి సినిమాతో మొదలైన  విజయ్ దేవరకొండ క్రేజ్  రోజు రోజుకి పెరుగుతూ పోతుంది.ఇప్పటిదకా టాలీవుడ్ కి మాత్రమే పరిమితం అనుకున్న ఆయన క్రేజ్ ని పూరీ జగన్నాథ్ 'లైగర్' మూవీతో దేశమంతా విస్తరించాలని చూస్తున్నాడు.ఈ  సినిమాలో విజయ్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఆయనకి జోడిగా అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.


అయితే ఈ సినిమా కోసం విజయ్ ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు అని టాక్. అయితే  ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఈ మధ్య వచ్చిన ఒక రూమర్ మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అదేంటి అంటే ఈ సినిమా కోసం బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌ని పూరి దింపబోతున్నారు అని టాక్. ఈ సినిమాలో ఆయన విజయ్ దేవరకొండ కి ట్రైనర్ గా కనిపించబోతున్నారు అని టాక్. అలానే బాక్సింగ్ నేపథ్యంలో జరుగుతున్న సినిమా కాబట్టి ఈ సినిమా లో చాలా మంది రియల్ బాక్సర్స్ ని పూరి నటింపచేస్తున్నారు అని టాక్. ఇక ఈ సినిమాలో బాక్సింగ్ సీన్స్ చూడటానికి రెండు కళ్ళు చాలవు అని అంటున్నారు. 


ఇక పూరి సినిమా అంటే అందులో హీరో ఎంత మాస్ గా ఉంటాడో అందరికి తెలిసిందే. ఈ లైగర్ లో విజయ్ ని పూరి ఎలా చూపిస్తాడో అని అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. ఇక పూరి జగన్నాథ్ , ఛార్మి , కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా మీద దేశమంతా అంచనాలు ఉన్నాయి. ఇక విజయ్ దేవరకొండసినిమా తర్వాత సుకుమార్ తో సినిమా మొదలుపెట్టబోతున్నారు. అది వచ్చే ఏడాది జనవరి లో మొదలయ్యే ఛాన్సులు ఉన్నాయి. విజయ్ సుకుమార్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: