అందాల ముద్దుగుమ్మ త్రిష , తరుణ్ హీరోగా నటించిన 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది . కానీ ఈ సినిమా  ఈ హీరోయిన్  అనుకున్నంత క్రేజ్ ను తెచ్చి పెట్టలేదు. ఈ సినిమా విడుదలైన కొంతకాలానికి ఈ ముద్దుగుమ్మకు ప్రభాస్ హీరోగా నటించిన 'వర్షం' సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది . ఈ సినిమా పెద్ద విజయం సాధించడంతో తెలుగు లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా ఎదిగింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.


ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చెబుతోంది. అందులో భాగంగానే కళావతి అనే హర్రర్ ఫిలిం లో కూడా నటించింది.  ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ సినిమాలు చేస్తుంది అంటే ఈ హీరోయిన్ ఎంత స్పెషల్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా హీరోయిన్లు అంటే పుకార్లు కామనే . ఆ హీరోయిన్ ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది అని రూమర్స్ రావడం వాటిలో కొన్ని నిజాలు అవ్వడం మరి కొన్ని పుకార్లు గానీ మిగిలిపోవడం జరుగుతుంటాయి. అలాగే త్రిష జీవితంలో కూడా రూమర్స్ లేకపోలేదు. అప్పట్లో త్రిష ఒక బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుంటుంది అని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది.


 కానీ అది పూకారు గానే మిగిలిపోయింది. అయితే తాజాగా త్రిష ఒక తమిళ దర్శకుడి ని పెళ్లి చేసుకోబోతోంది అనే వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ విషయంలో  నిజం.?ఉందా.? లేదా అనే విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. మరి ఈ వార్త అయినా  నిజమా లేక రూమరా తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే. ప్రస్తుతానికి త్రిష  సతురంగ వెట్టాయ్, పొన్నాయ్ సెల్వన్ సినిమాల్లో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: