దర్శకధీరుడు
రాజమౌళి ప్రస్తుతం
ఎన్టీఆర్ ,
రామ్ చరణ్ లు హీరోలుగా
ఆర్ఆర్ఆర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పాన్
ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో నిర్మిత మవుతుంది.
బాలీవుడ్ నటులు
అజయ్ దేవగన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
హీరోయిన్ గా
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తోంది. వీరే కాకుండా ఇతర భాషల్లోని పలువురు ప్రసిద్ధిగాంచిన నటులు కూడా ఈ సినిమాలో నటించడం విశేషం.
తెలుగు నుంచి
బాహుబలి తర్వాత రాబోతున్న అతిపెద్ద బడ్జెట్
సినిమా ఇదే కావడంతో ఈ
సినిమా పై దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ
సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల కాగా ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న ఈ
సినిమా అప్డేట్ రావడంతో అందరూ పండగ చేసుకున్నారు అని చెప్పవచ్చు. ఇక తాజాగా ఈ
సినిమా కోసం
రాజమౌళి వినూత్న ప్రయోగం చేస్తున్నాడు అని తెలుస్తోంది. సంగీత దర్శకుడు అనిరుధ్ తో ఓ ప్రమోషనల్ సాంగ్ ను చేయబోతున్నాడు.
ఇక్కడే
కీరవాణి అభిమానులు కొంత హర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే
రాజమౌళి తన మొదటి
సినిమా నుంచి ఇప్పటివరకు వేరే
సంగీత దర్శకుడితో పని చేసిన దాఖలాలు లేవు. అలాంటిది
కీరవాణి లాంటి పెద్ద
సంగీత దర్శకుడు ని పక్కనపెట్టి అనిరుధ్ తో ప్రమోషనల్ సాంగ్ ఏంటి అని ఆయన అభిమానులు తెగ విమర్శిస్తున్నారు.
బాహుబలి లాంటి పెద్ద స్థాయి
సంగీత నేపథ్యం కలిగిన సినిమాలు చేసిన కీరవాణికి ఈ ప్రమోషన్ సాంగ్ ఒక లెక్క అన్నట్లు వారు కామెంట్లు పెడుతున్నారు. ఈ విధంగా
ఆర్.ఆర్.ఆర్ సినిమా విషయంలో
రాజమౌళి కొంత అభాసుపాలు అవుతున్నారు. వాస్తవానికి
రాజమౌళి ఇలా చేయడం వెనుక వేరే ఉద్దేశం ఉందట.
తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఆయన ఈ విధమైన ప్రయత్నం చేస్తుండగా
కీరవాణి అభిమానులు మాత్రం
రాజమౌళి చేసిన పనిని ఏ మాత్రం సహించట్లేదు.