జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్.... గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కెరీర్ ప్రారంభంలో... హీరోయిన్ సైడ్ క్యారెక్టర్ గా చేసి మంచి గుర్తింపు పొందింది రష్మి. ఆ తర్వాత... ఫుల్ టైమ్ యాంకర్ గా మారిపోయింది రష్మీ. ఆ మధ్యలో గుంటూరు టాకీస్,  రాణిగారి బంగ్లా, మరియు అంతం ఇలాంటి సినిమాలలో యాంకర్ రష్మి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా... ఆడలేదు. దీంతో క్రమేణా సినిమాలు తగ్గించి జబర్దస్త్, మరియు ఇతర షోలకు యాంకర్ గానే ఉంటుంది రష్మి.

ఇక ప్రముఖ ఈటీవీ ఛానల్ లో  ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షోలో రష్మీ... చాలా రోజుల నుంచి యాంకర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జబర్దస్త్ కామెడీ షో లో... రష్మీ గౌతమ్ తన అందాలతో అందరినీ కట్టిపడేస్తుంది. కామెడీ స్కిట్ ల కంటే.. యాంకర్ రష్మీ అందాల కోసమే చాలా మంది జబర్దస్త్ వీక్షిస్తూ ఉంటారు. అలాగే... యాంకర్ రష్మీ మరియు సుడిగాలి సుదీర్ మధ్య జరిగే కొన్ని రూమర్స్ ఈ షోకు మరింత అందాన్ని తీసుకువచ్చాయి. ప్రతి షో లోనూ రష్మి మరియు సుడిగాలి సుదీర్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు చూపిస్తారు.

అయితే ఇది ఈ రేటింగ్ కోసం అని కొందరు అంటుంటే... మరికొందరేమో నిజంగానే వారు లవ్ లో ఉన్నట్టు చెబుతుంటారు. ఇక ఇది ఇలా ఉండగా యాంకర్ రష్మీ.... సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఏదైనా ఘటనలు జరిగిన సమయంలోనూ... రష్మి స్పందిస్తూ ఉంటుంది. అయితే తాజాగా జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే ''ఆషాడం లో అత్తా కోడళ్ళు'' అనే ప్రోగ్రాం లో పాల్గొంది రష్మి. ఈ సందర్భంగా గురుకాంత్ సినిమాలోని శ్రేయ ఘోషాల్ పాడిన.... మెరిసింది మేఘ మేఘ అనే పాటను రష్మీ పడింది. ఎంతో అనుభవం ఉన్న గాయని లాగా... పాడటంతో... ఆ ప్రోగ్రాం లో ఉన్న నటీనటులు రష్మీ ని మెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: