ఇక చిత్ర పరిశ్రమలో సినిమా స్థాయి ఏంటో తెలియాలంటే ఆ సినిమా సాధించిన వసూళ్ళ గురించి చెప్పాలి. ఒక సినిమాకి వచ్చే కలెక్షన్స్ ని బట్టి ఆ సినిమా హిట్టా ప్లాపా అనేది రుజువు అవుతుంది. ఇక గత సంవత్సరం సంక్రాంతికి టాలీవుడ్ సినిమాలు పోటీగా రిలీజ్ అవ్వడం జరిగాయి. ఇక అందులో మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మాస్ సినిమా 'సరిలేరు నీకెవ్వరూ' ఇంకా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన స్టైలిష్ సినిమా 'అల వైకుంఠపురంలో' చిత్రాలు కేవలం ఒక రోజు గ్యాప్ లోనే పొటా పోటీగా నువ్వా నేనా అంటూ రిలీజ్ అయ్యాయి. రెండు చిత్రాలు కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని అందుకొని రికార్డులు తిరగరాసాయి. అయితే ఈ రెండింటిలో ఏ సినిమా సంక్రాంతి పోటీలో గెలిచి నెంబర్ వన్ అయ్యి సంక్రాంతి విన్నర్ గా నిలిచిందో అని తీవ్రంగా చర్చ నడిచింది. ఇక మా సినిమా గొప్ప అంటే కాదు మా సినిమా గొప్ప అని నిర్మాతలు ప్రకటించుకోవడం జరిగింది. ఇక బన్నీ అయితే ఏకంగా ఇండస్ట్రీ హిట్ అంటూ పెద్ద ఫంక్షన్ కూడా పెట్టాడు. కాని ఈ రెండింటిలో అసలైన 2020 సంక్రాంతి విన్నర్ సినిమా ఏదో తాజాగా తేలింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరూ' సినిమా రియల్ సంక్రాంతి విన్నర్ గా తేలింది. ఇక తాజాగా 2020 సంవత్సరానికి గాను ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 50 సినిమాల జాబితా రిలీజ్ అవ్వడం జరిగింది.ఇక అందులో సౌత్ ఇండియా తరపున సూపర్ స్టార్ మహేష్ 'సరిలేరు నీకెవ్వరూ' సినిమా 280 కోట్ల గ్రాస్ వసూళ్లతో 41 వ స్థానంలో నిలిచింది.ఇక దీన్ని బట్టి సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరూ' రియల్ కలెక్షన్స్ తో రియల్ సంక్రాంతి విన్నర్ గా నిలిచినట్లు రుజువవ్వడం జరిగింది. ఇక అల్లు అర్జున్ ని ఈ విషయంలో నెటిజన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు. అప్పుడు అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఏమి మాట్లాడతాడు అని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.దీన్ని బట్టి అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో వసూళ్ల గురించి చెప్పుకున్న మాటలు ఒట్టి ఫేక్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి అల్లు అర్జున్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: