మెగా స్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన దగ్గరి నుంచి తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు. చాలా గ్యాప్ వచ్చినా తనలో ఆ పవర్ తగ్గలేదని నిరూపించుకుంటున్నాడు. ఖైదీ నెంబర్ 150తో 150కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించి.. బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు. ఇంకేముందీ అదే ఊపుతో వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. మాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టి.. కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమా అయిన లూసిఫర్ ని రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది కానీ.. మెగాస్టార్ సరసన నటించే ముద్దుగుమ్మ మాత్రం ఓకే కాలేదు.
ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ చేస్తున్నాడు. ఈ సిినిమాను చాలా ప్రిస్టీజియస్ గా తీసుకున్నాడు పవన్ కళ్యాణ్య. ఈ మూవీలో పవన్ స్టార్ కు జోడీగా మొదట సాయి పల్లవిని తీసుకోవాలనుకున్నారు. కానీ వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత నిత్యామీనన్, సమంత పేర్లు వినిపించాయి. అయితే మేకర్స్ ఇంకా హీరోయిన్ ఎవరనేది అఫీషియల్గా ప్రకటన చేయలేదు.