టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆయన హీరోగా తీస్తున్న ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం చివరిదశ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా చిరంజీవి తన తదుపరి సినిమాల చిత్రీకరణ వెళ్లిపోయారు.

సినిమా తర్వాత మోహన్ దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ లో చిరంజీవి నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన.మ్యూజిక్ పనులు మొదలయ్యాయి. ఇటీవలే సంగీత దర్శకుడు తమన్ తో దర్శకుడు మోహన్ రాజా సినిమా పాటల గురించి డిస్కస్ చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లబోతోంది. హీరోయిన్ గా త్రిష అనుకుంటుండగా కీలకమైన పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నాడు. ఇదే కాకుండా మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాలం సినిమా రీమేక్ ను మెగాస్టార్ చిరంజీవి చేస్తున్నాడు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ప్రత్యేకమైన సినిమా గా తెరకెక్కుతుంది బాబీ దర్శకత్వంలోనీ సినిమా. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా మెగాస్టార్ చిరంజీవికి తగ్గట్లుగా భారీ బడ్జెట్ తో  సినిమా చేస్తుండగా మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయంలో కనిపిస్తారని నిన్నటిదాకా అందరూ అనుకున్నారు కానీ చిరంజీవి ఇచ్చిన సలహాతో దర్శకుడు బాబీ ఈ పాత్రల విషయంలో కొన్ని మార్పులు చేశారు. మెగాస్టార్ చిరంజీవి డ్యుయల్ రోల్ లో నటించడం కంటే మల్టీ స్టారర్ గా చేస్తే నే ఎక్కువ అవుతుందని భావించి ఈ సినిమాలో మరో హీరో కోసం ఆ పాత్రను మళ్లీ రాయించారట. మరి ఆ పాత్రలో ఏ హీరో నటిస్తారో చూడాలి . 

మరింత సమాచారం తెలుసుకోండి: