కొన్ని నెలల క్రితం సమంత సినిమాలు ఒప్పుకోకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే సమంత ప్రెగ్నెంట్ అంటూ మీడియాలో తెగ ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆ గ్యాప్ నాగాచైతన్య తో విడాకుల కోసం తీసుకున్న గ్యాప్ అన్న విషయం ఇప్పుడు అందరికీ తెలిసింది.  


చైతూ తో విడాకుల వ్యవహారం ముగిసిన తరువాత సమంత ఒక్క క్షణం కూడ ఆలస్యం చేయకుండా తన పిఆర్ టీమ్ ను ఎలర్ట్ చేసి తాను కథలు వినడానికి రెడీగా ఉన్నాను అన్న విషయం దర్శక నిర్మాతలకు తెలిసేలా వ్యూహాత్మకంగా ప్రవర్తిస్తోంది. ఈ క్రమంలో తాను నటించబోతున్న సినిమాలను ప్రకటిస్తోంది.


డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై తెలుగు తమిళ భాషల్లో ఒక సినిమాను చేయబోతోంది. శంతరూబెన్ జ్ఞానశేఖరన్ అనే వ్యక్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఇదొక ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీతో పాటు శివలెంక కృష్ణప్రసాద్ బ్యానర్ పై కూడా ఒక సినిమా చేయడానికి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా బాలీవుడ్ కు సంబంధించి ‘ఫ్యామిలీ మేన్ సీజన్-2’ ఇచ్చిన గుర్తింపును క్యాష్ చేసుకుంటూ హిందీలో మరో వెబ్ సిరీస్ చేయడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.  


దసరా సీజన్ లో ప్రసారం అయిన ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోలో సమంత చాల ధైర్యంగా ధృడంగా కనిపించింది. జూనియర్ అడిగిన ప్రశ్నలకు చకచకా సమాధానం ఇచ్చేసి 25 లక్షలు గెలుచుకుని ఆ మొత్తానికి తన సొంత డబ్బును కూడ జత చేసి ప్రత్యూష ఫౌండేషన్ కు ఇచ్చి ఆమె పెద్ద మనసును చాటుకోవడమే కాకుండా తాను సామాజిక కార్యక్రమాలలో మరింత చురుకుగా పాల్గోనబోతున్నట్లు సంకేతాలు ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో పూజ హెగ్డే మ్యానియా కొనసాగుతున్న పరిస్థుతులలో సమంత విపరీతమైన పోటీని తట్టుకుని తిరిగి నెంబర్ వన్ స్థానానికి రాగలుగుతుందా అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..  



మరింత సమాచారం తెలుసుకోండి: