నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, అతడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిన త్రిష దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించింది. త్రిష ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పదేళ్లు పైనే గడుస్తోంది. సీనియర్ హీరోయిన్లు అందరూ ఒక్కొక్కరిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుంటే త్రిష మాత్రం ఇంకా సింగల్ గానే ఉన్నారు. ఆ మధ్య ఒకసారి బిజినెస్ మ్యాన్ అయిన వ‌రుణ్ మ‌ణియ‌న్‌తో నిశ్చితార్థం జరుపుకుని దాదాపు పెళ్లి పీఠల వరకు వెళ్లిన త్రిష లాస్ట్ మినిట్ లో ఆ వివాహాన్ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఆ విషయం టాలీవుడ్, కోలీవుడ్ అంతటా హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో త్రిష అలా మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవడానికి రీజన్ ఇదే అంటూ చాలా వార్తలు వినిపించాయి.

ఇక ఆ నిచ్చితార్థం క్యాన్సిల్ అయ్యాక మళ్ళీ వరుస చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయారు త్రిష. అయితే ఏమైందో ఏమో కానీ మళ్ళీ స్పీడు తగ్గినట్లు ఉంది. ఈ కారణంగా ఈమె పెళ్లి మళ్ళీ పెద్ద చర్చకు దారి తీసింది. ఇకనైనా త్రిష పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని ఆమె అభిమానులు ఎంతగానో ఆశిస్తున్నారు. ఈ అందాల తార శుభవార్త చెబితే వినాలని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇటీవలే తనకు కాబోయే వాడు ఇలా ఉండాలి అంటూ తన మనసులోని మాటలను బయట పెట్టింది మన పూరి.  పెద్దగా అందంగా లేకపోయినా పర్వాలేదని, తనని పూర్తిగా అర్దం చేసుకునేవాడు అయితే చాలని ప్రేమ వివాహమే చేసుకుంటానని చెప్పుకొచ్చింది.

ఇక ఈ మధ్య మళ్లీ ఈమె మరో బిజినెస్ మాన్ ప్రేమలో పడినదన్న వార్తలు హోరెత్తిన విషయం తెలిసిందే. కానీ ఈ అమ్మడు మాత్రం వీటిపై స్పందించ లేదు. అలాగే తన పెళ్లి గురించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఏడాది అయినా త్రిష పెళ్లి చేసుకుని ఒక ఇంటి వారు అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. మరి త్రిష ఏం చేస్తారో చూడాలి. 35 ఏళ్ళు దాటుతున్నా ఈ అందాల నటి ఇప్పటికీ ఎవర్ గ్రీన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుండటం విశేషం. ప్రస్తుత ఈమె తన మాతృ భాష అయిన తమిళంలోనే ఎక్కువ చిత్రాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: