టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాలు తెరకెక్కించాలి అంటే ఒకప్పుడు హీరోలతో పాటు నిర్మాతలు కూడా చాలా ఆలోచించేవారు. దర్శకుల వద్ద సరైన కథ లేకపోతే ఇద్దరు హీరోలను పెట్టి భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తే భారీ నష్టం వాటిల్లుతుందని ఆలోచన నిర్మాతల్లో ఉండగా, హీరోలు కూడా తమకు ఎక్కడ ప్రాధాన్యత తగ్గుతుందో అన్న అనుమానాలను వ్యక్తం చేసేవారు ఆ విధంగా ఆ మధ్య కాలంలో హీరోలు ఎక్కువగా మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపలేదు. కానీ ఇటీవలే మన హీరోలలో మార్పు వచ్చింది.
కథ బాగుంటే మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఏ మాత్రం వెనకాడటం లేదు. ఏ మాత్రం ఆలోచించడం లేదు. నిర్మాతలు సైతం ఒప్పుకుంటే ఎంతటి బడ్జెట్ అయినా పెట్టి సినిమాలను తెరకెక్కించాలని భావిస్తున్నారు. ఆ విధంగా ఈ ఏడాది ఏకంగా ఐదు భారీ మల్టీస్టారర్ చిత్రాలు కేవలం యాభై రోజుల వ్యవధిలోనే 5 భారీ మల్టీస్టారర్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా భారీ రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందనే కామెంట్ లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
ఇకపోతే అక్కినేని నాగచైతన్య మరియు నాగార్జున కలిసి నటిస్తున్న బంగార్రాజు సినిమా జనవరి 15వ తేదీన విడుదల కాబోతుంది. అలాగే పవన్ మరియు రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య ఫిబ్రవరి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలాగే దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్ మరియు రానా హీరోలుగా నటిస్తున్న f3 సినిమా కూడా ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ విధంగా యాభై రోజుల వ్యవధిలోనే ఐదు భారీ బ్లాక్ బస్టర్ మల్టీస్టారర్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి వారిని కనువిందు చేయనున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి