ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం ఎంతగానో పెరిగిపోయింది. సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది వినూత్నమైన ఆలోచనలతో ఫేమస్ అవుతున్నారు. అయితే ఇలా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో మీమ్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి.ప్రతి విషయంపై ఇటీవలి కాలంలో మీమ్స్ చేయడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. అయితే మీమ్స్ చేస్తూ సోషల్ మీడియా లో డబ్బులు సంపాదిస్తున్న వారు నేటి రోజులలో చాలామంది ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలా మీమ్స్ చేసే వారందరికీ కూడా ప్రస్తుతం గాడ్ఫాదర్ గా మారిపోయారు హాస్యనటుడు బ్రహ్మానందం.



సాధారణంగా సినిమాల్లో బ్రహ్మానందం హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. ఇక అవే హావభావాలకు సంబంధించిన ఫోటోలను మీమ్స్ తో జత చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇక అవి చూసిన వారు పగలబడి నవ్వు కోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఇటీవలి కాలంలో బ్రహ్మానందం ఫోటోతో ఎన్నో మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే తన ఫోటోతో మీమ్స్ చేస్తున్న వారి పట్ల ఒకప్పుడు బ్రహ్మానందంతో సానుకూలంగా స్పందించారు. ఇక ఇటీవల ఈ టీవీలో ప్రసారమయ్యే ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన బ్రహ్మానందం మీమార్స్ గురించి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


తన ఫోటోతో మీమ్స్ క్రియేట్ చేస్తున్న వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను అంటూ బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. గత రెండేళ్ల నుంచి కొన్ని కారణాల వల్ల సినిమాల లో నటించ లేకపోయాను. కానీ మీమ్స్ తయారు చేసే వాళ్లు తన ఫోటోలతో ప్రేక్షకులను నవ్వించి తనను మర్చిపోకుండా చేశారు. ప్రేక్షకులను నవ్వించడంమే నా లక్ష్యం అది సినిమాల్లో అయితే ఏంటి మీమ్స్ రూపంలో అయితే ఏంటి అంటూ బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. నేను సినిమాల్లో నటించకపోయినా ప్రేక్షకులు మర్చిపోకుండా చేసిన మీ అందరికీ కూడాచేతులెత్తి నమస్కారం చేస్తున్న అంటూ బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: