గత ఏడాది నుండి నందమూరి అభిమానుల్ని ఎంతగానో ఊరిస్తున్న బాలయ్య మూవీ 'అఖండ' ఇపుడు మన ముందుకు రావడమే కాదు వచ్చి అందరి మన్నలను పొందుతూ కాసుల వర్షం కురిపిస్తోంది. కరోనా కారణంగా మూసివేయబడ్డ థియేటర్లకు కొత్త వైభవం. ఈ మహమ్మారి కష్టాలతో మునిగిపోయిన సినీ పరిశ్రమ కార్మికులకు డిస్ట్రిబ్యూటర్స్, సాంకేతిక నిపుణులు, కార్మికులు వంటి వారికి అఖండ సినిమా నిజంగా వెలుగులు తెచ్చింది. అయితే ఈ సినిమా కథను బాలయ్య మొదట వద్దని తిరస్కరించినట్లు చెబుతున్నారు కొందరు సినీ ప్రముఖులు. మొదట ఈ కథతో దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ నందమూరి బాలకృష్ణ వద్దకు వెళ్ళగా ఈ అఘోరా పాత్ర ఏంటి....కమల పిల్లలు ఇవన్నీ కొంచం కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. కథను అయినా కాస్త మార్చండి లేదా పూర్తిగా వేరే యాంగిల్ లో రాయండి అన్నారట.

కానీ బోయపాటి పట్టు వదలకుండా మళ్ళీ కొద్దిపాటి మార్పులు మాత్రమే చేసే నన్ను నమ్మండి ఈ కథ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ కథ పాదరసం లాంటిది ఒక్క లైన్ మార్చినా అర్దం ఉండదు అని నచ్చచెప్పి ఒప్పించారట. అలా ఈ కథ కాస్త ఆలస్యమైనా మళ్ళీ సెట్స్ మీదకి వచ్చిందని వార్తలు వినపడుతున్నాయి. కాగా ఇపుడేమో బోయపాటి చెప్పినట్టే ఈ కంటెంట్ అందరికీ బాగా నచ్చింది. ప్రేక్షక జనాలు ఈ సినిమా చూసేందుకు తరలి వస్తూ విజయవంతం చేస్తున్నారు. ఇక బాలయ్య తన నట విశ్వరూపం చూపించి రికార్డులు బద్దలు కొడుతున్నారు. వీరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాల రికార్డులను సైతం తిరగరాస్తూ సరికొత్త రికార్డును సృష్టిస్తున్నాడు ఈ నందమూరి నటసింహం బాలకృష్ణ.

ఈ హ్యాట్రిక్ చిత్రం ఇపుడు థియేటర్లకే అఖండ జ్యోతితో గొప్ప శోభను తీసుకొచ్చింది. అయితే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు జుగుప్సాకరంగా ఉన్నాయని అవి లేకుండా ఉంటే ఈ సినిమాకి తిరుగే లేదని కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి బోయపాటి బాలకృష్ణను ఒప్పించాడు కాబట్టి ఇలా జరిగింది. ఒకవేళ బాలయ్య కాదన్నప్పుడు బోయపాటి కథను మర్చి ఉంటే మనము ఈ రోజు అఖండను చూసేవారిమీ కాదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: