మళయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌.. తెలుగులో సూపర్‌ హిట్‌ చిత్రం "ఆ ఆ" ద్వారా టాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ప్రేమమ్, శతమానం భవతి, హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు వంటి హిట్‌ చిత్రాల్లో తన గ్లామర్‌, ఫర్మార్మెన్స్‌తో ఆడియన్స్‌ను అలరించింది. ప్రస్తుతం అనుపమ హీరోయిన్‌గా తెరకెక్కిన 'రౌడీ బాయ్స్‌' చిత్రం ఈనెల 14వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల అవుతుంది. దీంతోపాటు అనుపమ నటించిన మరో రెండు చిత్రాలు 'కార్తీకేయ-2', '18 పేజీస్‌' ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే తమిళంలో ప్రస్తుతం 'తళ్లిపోగాదే', 'తలై నగరం-2' మూవీస్‌లో నటిస్తోంది.

ఇదిలావుంటే, అనుపమ పరమేశ్వరన్‌..తనకు రెండు జీవితాలు ఉన్నాయని చెబుతోంది. తన పర్సనల్‌, ప్రొఫెషనల్‌ లైఫ్‌ గురించి ఈ మళయాళ ముద్దుగుమ్మ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నటీనటుల పర్సనల్‌ లైఫ్స్‌పై ప్రొఫెషనల్‌ ఎఫెక్ట్‌ తప్పకుండా ఎంతో కొంత ఉంటుందని ఈ భామ చెబుతోంది. తనకు కూడా అలాంటి అనుభవాలే ఎదురు అయ్యాయని తెలిపింది. కొన్ని పాత్రల్లో నటించాక అవి కొన్నాళ్లపాటు మనసుల్ని అంటిపెట్టుకునే ఉంటాయని వెల్లడించింది. అయితే తాను మాత్రం వీలైనంత వరకు.. తన పర్సనల్‌, ప్రొఫెషనల్‌ లైఫ్స్‌ను వేరువేరుగానే ఉండేలా జాగ్రత్త పడతానని అనుపమ స్పష్టం చేసింది.

అయితే కెమెరా ముందుకు వెళ్లినప్పుడు మాత్రం.. తాను అలా ఉండలేనని కూడా అనుపమ తెలిపింది. సినిమా కోసం భావోద్వేగాలు, హావభావాలు పండించేటప్పుడు ఆయా కథలే తనను ప్రభావితం చేస్తుంటాయని చెప్పింది. ఆ సమయంలో తన పర్సనల్‌ లైఫ్‌ను అసలు గుర్తుకు రానివ్వనని తెలిపింది. అంతేకాకుండా తాను నిజ జీవితంలో చూసి నేర్చుకున్న దానికంటే.. సినిమాలను చూసి నేర్చుకున్నదే ఎక్కువని కూడా చెప్పడం మరో ఆసక్తికర అంశం. ఇప్పటివరకు ఆయా సినిమా కథలు, అందులోని పాత్రలే తనకు ఎక్కువ జీవితాన్ని, తెలియని అనుభూతిని పరిచయం చేశాయని అనుపమ పరమేశ్వరన్‌ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: