టాలీవుడ్ లెక్కల మాస్టర్ గా పేరు సంపాదించుకుని తన కాలిక్యులేషన్స్  తో తెలుగు ప్రేక్షకులందరినీ మెప్పించిన సుకుమార్.. ఇటీవలే అల్లు అర్జున్ తో కలిసి పుష్ప అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో సుకుమార్ టేకింగ్ కి అల్లు అర్జున్ నటనకి ఎంతగానో ప్రశంసలు దక్కాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కిన ఈ సినిమా అటు టాలీవుడ్ లోనే మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా సత్తా చాటింది. ఏకంగా బాలీవుడ్ సినిమాలకు సైతం పోటీ ఇచ్చిన పుష్ప సినిమా అక్కడ కూడా 100 కోట్ల వసూళ్లను రాబట్టి సత్తా చాటింది అని చెప్పాలి.


 పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమా సూపర్ హిట్ కావడంతో అటు అల్లు అర్జున్ తో పాటు దర్శకుడు సుకుమార్ కూడా పాన్ ఇండియా స్టార్ డమ్ సంపాదించారు. పుష్ప సినిమా చూసిన తర్వాత ఎంతోమంది బాలీవుడ్ హీరోల కన్ను దర్శకుడు సుకుమార్ పై పడినట్లు తెలుస్తోంది.  ఇక ఈ టాలీవుడ్ లెక్కల మాస్టారు తో సినిమా చేసేందుకు బాలీవుడ్ హీరోలు కూడా సిద్ధమై పోతున్నారట. ఇప్పటికే పుష్ప సినిమాను చూసి బన్నీ, సుకుమార్ పై ప్రశంసల వర్షం కురిపించిన బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ సుకుమార్ తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు ప్రస్తుతం ఒక టాక్ టాలీవుడ్ లో వైరల్ గా మారిపోయింది.


 ఇక ఈ విషయంపై ఇటీవలే సుకుమార్ ఇండైరెక్టుగా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు దర్శకుడు సుకుమార్. నేను సినిమా షూటింగ్ లో ఉన్న సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కి ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడిగారు. అలాగే నువ్వు నాతో పని చేయాలి అంటూ తెలిపారు.. వీలు చూసుకుని ముంబై కి రండి అంటూ ఆహ్వానం కూడా పంపారు. స్క్రిప్టు దొరికిన రోజు తప్పకుండా అక్షయ్ కుమార్  దగ్గరికి వెళ్లి కథ వినిపిస్తాను అంటూ దర్శకుడు సుకుమార్ చెప్పుకొచ్చారు. అయితే బాలీవుడ్ హీరోలలో ప్రత్యేకంగా ఒకే హీరోతో సినిమాలు చేయాలని అనుకోలేదు. కానీ ఒకసారి అక్షయ్ కుమార్ తో సినిమా చేయాలని మాత్రం అనుకుంటున్నాను అంటూ తన మనసులో మాట బయట పెట్టాడు సుకుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: