తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీతిసింగ్. ఆమె ఇండస్ట్రీలో యంగ్ హీరోలతో కూడా కలిసి నటించిన ఈ భామకు అసంతృప్తిగానే ఉందంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దాంతో ఆమె పూర్తిగా డిసప్పాయింట్ అయ్యిందని చెప్పుకొచ్చింది. ఆమె టాలీవూడ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలందరి సరసన నటించిన అప్పటికీ.. తనకు మాత్రం అసంతృప్తిగానే అనిపిస్తుందని చెప్పుకొచ్చింది. చిత్ర పరిశ్రమలో ఆమెకి స్టార్ హీరోలు, బడా దర్శక నిర్మాతలతో ఈమెకు మంచి పరిచయం ఉండడం వల్లే అందరూ కూడా ఈమెకు పెద్ద పెద్ద సినిమాలలో అవకాశాలు ఇస్తున్నారు.

ఇక తాజా సమాచారం ప్రకారం.. రకుల్ పాన్ ఇండియా సినిమాల పై కూడా అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టాలీవుడ్ తో పోల్చుకుంటే బాలీవుడ్ సినిమాలపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపిస్తుంది ఈ భామ. కాగా..  ఈ విషయంపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. నేను తెలుగు, తమిళం, నా సొంత భాష హిందీలో కూడా మాట్లాడగలను అని చెప్పుకొచ్చింది. ఇక తెలుగు దర్శకులు రాబోయే పాన్ ఇండియా చిత్రాల్లో అవకాశాలు కల్పిస్తారని.. మెయిన్ లీడ్ గా పరగణించాలని కోరుకుంటున్నానని అన్నారు.

రకుల్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే నటిస్తుంది. ఆమెకి టాలీవూడ్ లో ఎలాంటి సినిమాలు కమిట్ కాలేదు. ఇక ప్రస్తుతం రకుల్ పాన్ ఇండియా హీరోయిన్ గా వెలిగిపోవాలన్న ప్లాన్ లో భాగంగానే హిందీలో క్రేజ్ సంపాదించాలని అక్కడి సినిమాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. తెలుగు చిత్ర పరిశ్రమలో  డైరెక్టర్లు తనకు పాన్ ఇండియా సినిమాలో అవకాశాలు కల్పించలేదనే కారణంతో ఈమె బాలీవుడ్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి రకుల్ ప్రీతిసింగ్ కి హీరోయిన్ గా మంచి అవకాశాలు ఇచ్చింది మాత్రం టాలీవుడ్ పరిశ్రమ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: