ప్రస్తుతం ఉన్న కరోనా కాలంలో అందరు ఓటీటీ లో సినిమాలు వెబ్ సిరీస్ లు చూడటానికే ఇష్టపడుతున్నారు. దీంతో ఇప్పటికే వాటి సబ్ స్క్రిప్షన్స్ చార్జీలు భారీగా పెంచేసారు. ఇక మన తెలుగులో ఉన్న ఏకైక ఓటీటీ యాప్ ఆహా. టాలీవుడ్‌ బడా నిర్మాత అయిన అల్లు అరవింద్‌ స్థాపించిన తెలుగు ఏకైక ఓటీటీ యాప్‌ ఆహానే కావడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం.

ఈ ఆహా యాప్ అందుబాటులోకి వచ్చినప్పటి నుండి ఎంటర్ టైన్ మెంట్ కి కొదవ లేకుండాపోయింది. కొత్త ఆలోచనలతో సరికొత్త టాక్ షోలతో, లెటెస్ట్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో పాటు సరికొత్త రియాలిటీ గేం షోతో ఆహా డిజిటల్‌ రంగంలో నెం 1 గా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఎవ్వరు ఊహించని విధంగా ఆహా స్థాపించిన కొద్ది కాలంలోనే టాప్ ఓటీటీ సంస్థగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా  ఆహా సబ్‌స్రైబర్ల  సంఖ్య కూడా రోజురోజుకు భారీ సంఖ్యలో పెరుగుతోంది.

అయితే ఇప్పటి వరకు ఆహా  అంటే అల్లు కుటుంబం వాళ్లదే అనుకున్న జనాలకు అల్లు వారి అబ్బాయి ఒక్క ట్వీట్ తో ఊహించని షాక్ ఇచ్చాడు. అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు వారి వారసుడు హీరో అల్లు శిరీష్‌ ఆహాతో తనకు సంబంధం లేదంటూ ఆసక్తికర ట్వీట్‌ చేయడం ఇప్పుడు అభిమానుల్లో కొత్త  టెన్షన్ పుట్టిస్తుంది. ఆహా యాప్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యలు వచ్చిన్నప్పుడు.. వాటిని వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆహా వీడియోస్‌ టీంతో పాటు అల్లు అరవింద్‌, అల్లు అర్జున్, అల్లు శిరీష్‌లను కూడా ట్యాగ్ చేస్తున్నారు కొందరు నెటిజన్స్. ఇలా ఒకరు ఇద్దరు కాదు చాలా మంది ఆహాలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వెంటనే సోషల్ మీడియాలో శిరీష్ ని కూడా ట్యాగ్ చేస్తున్నారు.

తాజాగా దీనిపై అల్లు శిరీష్ స్పందిస్తూ..."ఆహాకు నాకు ఏ సంబంధం లేదు" అంటూ ట్వీట్ చేసాడు. ఇక శిరీష్ ఇలా ట్వీట్ చేయడంతో నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. ఆహా అల్లు ఫ్యామిలీదే కదా, ఆహాతో తనకు సంబంధం లేకపోవడం ఏంటి..అల్లు ఫ్యామిల్లో గోడవలు మొదలైన్నట్లున్నాయి అంటున్నారు. ఏది ఏమైనా ఇలా మాట్లాడి తన ఇంటి పరువు తీసుకున్నాడు శిరీష్ అంటున్నారు పలువురు ప్రముఖులు.  


మరింత సమాచారం తెలుసుకోండి: