రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరు అందరికి తెలిసిందే.. సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్  సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ పంజాబి భామ.. ఆ సినిమాలో ప్రార్థన పాత్రలో నటించింది. ఎంతో పద్దథిగా నటించింది. ఈ సినిమా హిట్ అయింది. రకుల్ కు మంచి పేరు కూడా వచ్చింది. ఆ సినిమా తో దర్షక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది.అలా వరుస సినిమాల లో నటించే అవకాశాన్ని అందుకుంది.


తర్వాత వచ్చిన సినిమా లో కాస్త గ్లామర్ డోస్ పెంచింది. ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా కనిపించి యువతకు నిద్ర లేకుండా చేసింది. తెలుగు తో పాటు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ వరస సినిమాలు చేస్తుంది. ఆమె తాజాగా నటించి సుమారు అర డజన్ కు పైగా సినిమాలు ఈ ఏడాది విడుదల కాబోతున్నాయి. వాటిలో 6 సినిమాలు బాలీవడ్ కు చెందినవే. ఛత్రీవాలీ సినిమాలో రకుల్ కండోమ్ టెస్టర్ గా కనిపిస్తుందట. ఇకపోతే అమిథాబ్ తో రన్ వే-34, అజయ్ దేవగణ్, సద్ధార్థ మల్హోత్రాతో థ్యాంక్ గాడ్, ఆయుష్మాన్ ఖురానాతో డాక్టర్ జీ, అటాక్ తో పాటు మరో రెండు సినిమాల లొ నటిస్తూ బిజీగా ఉంది.


ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు మరో సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానుల తో పంచుకుంది.ఈ ఏడాది తన కెరీర్ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుందని భావిస్తున్నట్లు చెప్పింది. తన 7 సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నట్లు చెప్పింది. వాటిలో 6 హిందీ సినిమాలేనని చెప్పింది.. ప్రస్తుతం అమ్మడు నటిస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి..ఛత్రీవాలీలో కండోమ్ టెస్టర్, రన్ వే-34లో పైలెట్, అటాక్ సైన్స్ ఫిక్షన్, డాక్టర్ జీలో గైనకాలజిస్ట్ పాత్రలొ కనిపించనుంది..ఇలా వరుసగా ఏడు సినిమాలలో ఏడు పాత్రలలో నటిస్తూన్నారు..ఇంతవరకూ మంచి హిట్ లేని రకుల్ కు ఇప్పుడు హిట్ సినిమాలు పడేలా ఉన్నాయి. ఎంతవరకు అమ్మడుకు పేరు వస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: