టాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరైన అడవి శేషు తాజాగా మేజర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం లోని నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీ కి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు.

 ఇది వరకే అడవి శేషు శశికిరణ్ తిక్క కాంబినేషన్ లో గూడచారి సినిమా తెరకెక్కింది.  గూడచారి సినిమా మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా సినిమా మేజర్ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే మేజర్ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.  ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో సాయి మంజ్రేకర్,  శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న మేజర్ మూవీ ని జూన్ 3 వ తేదీన థియేటర్ లలో చాలా  గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

 ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో మేజర్  చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ ను వేగ వంతం చేసింది. అందులో భాగంగా మేజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా వినూత్న పద్ధతిలో ఏర్పాటు చేయబోతున్నారు.  ప్రేక్షకులు మే 29 వ తేదీన వైజాగ్ లో సినిమా తర్వాత ప్రీ రిలీజ్ వేడుక ను నిర్వహించడం మేజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్రత్యేకత. ఇలా సరి కొత్త పద్ధతి లో మేజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర బృందం నిర్వహించబోతోంది. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్ ధరలను కూడా తక్కువగా ఉంచనున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: