రాజమౌళి త్రివిక్రమ్ శ్రీనివాస్ లు టాప్ డైరెక్టర్స్ గా మారకముందే పూరీ జగన్నాథ్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ స్థానాన్ని అందుకుని ఆరోజుల్లోనే అత్యధిక పారితోషికాన్ని అందుకునే స్థాయికి ఎదిగాడు. టాప్ హీరోలందరితోను సినిమాలు తీసి వారికి భారీ హిట్స్ ఇచ్చాడు.


అలాంటి పూరీ వరస ప్లాప్ లలో ఉన్నప్పుడు టాప్ హీరోలు ఎవరు అతడి వైపు చూడని పరిస్థితులలో రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్’ తీసి ఆసినిమా ఘన విజయంతో తన ఆర్ధిక బాధల నుండి బయట పడ్డానని స్వయంగా పూరీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తన కొడుకుని మాస్ హీరోగా చేయాలని పూరీ స్వయంగా ఎన్నో సినిమాలు నిర్మించినా అవన్నీ ఫ్లాప్ అయ్యాయి.




అయినప్పటికీ పూరీ కొడుకు ఆకాష్ తన ప్రయత్నాలు కొనసాగిస్తూ సినిమాలలో నటిస్తూనే ఉన్నాడు. లేటెస్ట్ గా ఆకాష్ ‘చోర్ బజార్’ అనే కామెడీ క్రైమ్ మూవీలో నటిస్తున్నాడు. ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఆకాష్ తన తండ్రి పూరీ గురించి అనేక ఆశక్తికర విషయాలు బయటపెట్టాడు. తమ ఇంటిలో 10కి పైగా కుక్కలు రకరకాల లవ్ బర్డ్స్ ఉన్న విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఒకానొక సమయంలో వాటికి మంచి ఫుడ్ పెట్టడానికి కూడ శక్తిలేక తన తండ్రి తమ కుక్కలను తన స్నేహితులకు ఇచ్చి వేసిన సందర్భాన్ని బయటపెట్టాడు.


ఇదే ఇంటర్వ్యూలో తన తండ్రి తన తల్లి విడిపోతున్నారు అంటూ కొన్ని సోషల్ మీడియా సైట్స్ లో వచ్చిన వార్తలు తనకు ఎంతో బాధను కలిగించాయని తన బాధను షేర్ చేసుకున్నాడు. తన తల్లి తండ్రి ప్రేమించి పెళ్ళి చేసుకున్నారని. తన తండ్రి తన తల్లిని పెళ్ళి చేసుకుంటున్నప్పుడు తన వద్ద కేవలం 300 రూపాయలు మాత్రమే ఉన్నాయని అవి కూడ ఎంత కాలం ఉంటాయో తనకు తెలియదు అన్నప్పుడు తన తల్లి నవ్వుతూ తన తండ్రిని పెళ్ళి చేసుకున్న విషయం ఎంతమందికి తెలుసు అని ప్రశ్నిస్తున్నాడు..






మరింత సమాచారం తెలుసుకోండి: