ఇక 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రబృందానికి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం నాడు విడుదల కావాల్సిన ఈ మూవీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో లీకవ్వడం జరిగింది.ఎడిటింగ్ రూమ్ నుంచే ఈ సీన్స్ లీక్ అయినట్లు చిత్ర బృందం అనుమానం వ్యక్తం చేస్తోంది.మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శరత్‌ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ 'రామారావు ఆన్‌ డ్యూటీ'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 29 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సమయంలో చిత్ర బృందానికి అసలు ఊహించని పెద్ద షాక్‌ అనేది ఎదురైంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు సోషల్‌మీడియాలో లీకవ్వడం జరిగింది. హీరో రవితేజ సంభాషణలతో కూడిన ఆ సన్నివేశాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇక దీనిపై చిత్ర బృందం ఒక్కసారిగా కంగుతింది. ఈ వ్యవహారంపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఈ సినిమా నిర్మాతలు కూడా సిద్ధమవుతున్నారు. 


ఎడిటింగ్ రూమ్ నుంచి రామారావు చిత్ర సన్నివేశాలు అనేవి లీకైనట్లు చిత్ర బృందం అనుమానం వ్యక్తం చేస్తోంది. లీకైన సన్నివేశంలో అధికార పార్టీపై విరుచుకుపడుతూ పరోక్షంగా రవితేజ చేసిన సంభాషణలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతున్నాయి.ఇక శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మాస్ మహారాజా రవితేజకు జోడీగా దివ్యాంశ కౌశిక్‌ నటిస్తున్నారు. రజీష విజయన్‌ ఇంకా అలాగే సీనియర్ నటుడు వేణు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి విశేష స్పందన లభించింది. ఇంతకు ముందెన్నడూ కూడా చూడని రీతిలో మాస్ మహారాజా రవితేజను శరత్‌ మండవ ఈ సినిమాలో చూపించారు. రవితేజ ఇందులో ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు.ఈ తరుణంలో ఇలా లీక్ అవ్వడం మూవీ యూనిట్ కి బాధాకరమనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: