ప్రస్తుతం స్టార్ హీరోలు చాలా వరకు పాన్ ఇండియా సినిమాలకు బాగా అలవాటు పడుతున్నారు. దీంతో డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా సినిమాలనే తెరకెక్కించాలి అని మంచి మంచి కథలతో ముందుకు వస్తున్నారు.


ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలలో నటించి తమ తరువాయి ప్రాజెక్టులలో కూడా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారట. పైగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాలలో నటిస్తున్నారు. ఇంతకూ ఆ హీరోలు ఎవరంటే.


ప్రభాస్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత అయినా క్రేజ్ మొత్తం మారిపోయింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఆ తర్వాత కూడా పాన్ ఇండియా సినిమాలకు అలవాటు పడ్డాడట. దాంతో సాహో, రాధేశ్యామ్ సినిమాలతో ముందుకు రాగా ఈ సినిమాలు సక్సెస్ కాలేకపోయాయి. ఇక ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆదిపురుష్ 3D సినిమాలో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నాడు. వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, దీపికా పదుకొణెతో కలిసి ప్రాజెక్ట్- K సినిమాలో కూడా నటిస్తున్నాడు. తరువాత మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్, సందీప్ వంగతో కలిసి స్పిరిట్ వంటి సినిమాల్లో నటించనున్నాడు.


ఎన్టీఆర్: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత వరుస ప్రాజెక్టుతో బిజీగా మారాడు. అందులో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్30 సినిమాను చేయనున్నాడట.ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. దీంతో పాటు ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో కూడా భారీ బడ్జెట్ తో మరో రెండు సినిమాలు చేయనున్నాడని తెలుస్తుంది..



రామ్ చరణ్: స్టార్ హీరో రామ్ చరణ్ నటించిన కూడా ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ రేంజ్ లో దూసుకుపోతున్నాడట.ఆ సినిమా తర్వాత ఆచార్యతో ముందుకు రాగా ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే చరణ్ ఆచితూచి ఆడుగులు వేస్తున్నాడని చెప్పవచ్చు. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా #RC15. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా ఈ సినిమా దాదాపుగా 60శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుందని సమాచారం. ఇక గౌతమ్ తిన్ననూరి, ప్రశాంత్ నీల్ డైరెక్టర్స్ తో రామ్ చరణ్ మరో రెండు సినిమాలను చేయనున్నాడని సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి: