చిరంజీవి పై  గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్ గా చేస్తూ ఉన్నారు మెగా ఫ్యామిలీ, చిరంజీవి అభిమానులు. ఒక వారితో పాటుగా చిరంజీవి సపోర్ట్ చేసినట్లు కూడా ఇలాగే స్పందిస్తూ ఉన్నారు. తాజాగా మెగాస్టార్ అభిమాని అయిన ఉత్తేజ్ ఈ వ్యవహారం పైన స్పందించడం జరిగింది. చాలా బాధేసింది గరికపాటి గారు చిరంజీవి అన్నయ్య గురించి ఇలా అనడం.. మీరు చెప్పే ప్రవచనాలు ప్రతిరోజు వింటూనే ఉన్నాము మా ఇంట్లో 24 గంటలు రేడియో మోగుతూనే ఉంటుంది. ఇప్పుడిప్పుడే మా జనరేషన్ మీ మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంది. ఒక గౌరవం కూడా చూస్తోంది సరిగ్గా ఇలాంటి సమయంలో శిఖరాగ్ర ప్రయాణంలో ఇసుక వల్ల జారీ పడ్డట్టుగా చిన్న చిన్న ఈర్ష్య అసూయల వల్ల జయించలేక రెండు నిమిషాలు సమయం వేచి ఉండలేక వల్ల జారిపడ్డారు అని తెలియజేశారు.


అన్నయ్యతో మేము ఫోటోలు తీసుకోవడానికి చాలా ఎగబడతాము. మేమందరు కేవలం చిరంజీవి అనే నాలుగు అక్షరాల ఫోటోని తీసుకుంటున్నాము.నాలుగు దశాబ్దాల చరిత్రతో, శ్రమతో, వినయంతో ఆ ఫోటోని ఎంతగానో ఎదిగేలా చేసామని తెలియజేశారు. ఎంతోమంది సేవా గుణంతో మంచితనంతో మానవత్వంతో,  రక్త నేత్రదానాలతో ,ఆక్సిజన్ సిలిండర్లతో, ట్రస్టులతో, ఎంతోమంది దైవంగా నిలిచిన మనిషి మా చిరంజీవి అందుకే మేము ఫోటో దిగుతున్నామని తెలియజేశారు.


గరికపాటి గారు పుస్తకమైన పేపర్ అయిన కింద పడితే తీసి పైన పెడతారు అంత గొప్పగా ఎవరు రాసిన ఎవరు బాగా యాక్టింగ్ చేసిన సరే మంచి మనిషిని ఎవరు వెంటనే పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడారు. సల్మాన్ ఖాన్ అమితాబచ్చన్ తో ఊరికే ఫ్రీగా యాక్టింగ్ చేయరు అన్నయ్యతో అన్నయ్యకి వారిచ్చే గౌరవం అదే అని తెలియజేశారు. ప్రస్తుతం గరికపాటి పైన చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: