తెలుగు పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ప్రపంచం మెచ్చిన స్టార్ హీరో..బాహుబలి తర్వాత ఆయన రేంజ్ పూర్తిగా మారిపోయింది.బాహుబలి కి ముందు కేవలం టాలీవుడ్ లోనే సినిమాలు చేసిన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్నాడు.ప్రభాస్ తెరకెక్కించే ప్రతి సినిమా కూడా భారీ తారగణంతో తెరకెక్కిస్తూ భారీ కలెక్షన్స్ రాబడుతుంది.

 

అయితే కథపరంగా సినిమాలు ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం భారీ స్థాయిలో వస్తుండడంతో దర్శకులు కూడా ప్రభాస్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాఆది పురుష్ ‘.ఈ సినిమాని ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తుంది. ఇక ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయేసరికి ఈ సినిమాను మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం.


అందుకే ఈ మూవీని 2023 జూన్ నెలకు వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్సినిమా షూటింగ్ మిగతా వర్క్ పై బిజీగా ఉన్నాడు. ఓవైపు ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాకు ఎక్కువగా సమయాన్ని కేటాయించడం లేదనే వార్తలు చక్కర్లు కొదుతున్నాయి.హోం భలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. అలాగే జగపతిబాబు, పృథ్వీరాజ్, సుకుమారన్, అభినయశ్రీ, మీనాక్షి చౌదరి తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తామని చిత్ర బృందం డేట్ ను కూడా ఫిక్స్ చేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా 2024 కు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని సమాచారం..సినిమా విడుదల వాయిదా పడనుంది..ఇది డార్లింగ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: