పూజ హెగ్డే పేరు వింటేనే ప్రేక్షకులు తెగ భయపడిపోతున్నారు. ఒకప్పుడు ఈమెను అభిమాన హీరోయిన్ గా చూసుకున్న వాళ్లే ఇప్పుడు వద్దు రా బాబు అని అంటున్నారటా..కారణమేంటంటే గత కొంతకాలం నుంచి ఈమె ఐరన్ లెగ్ గా అయితే మారింది. అయితే ఇండస్ట్రీకి తొలిసారిగా 2010 లో అడుగుపెట్టిన పూజా.. 2014లో ముకుంద సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చింది.

మొదట్లో వరుస ఫ్లాప్ లను అందుకున్న ఈ చిన్నది ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాలో నటించి మంచి విజయం అందుకుంది. ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఏ సినిమాలో నటించిన కూడా ఆ సినిమా కచ్చితంగా మంచి విజయం అందుకోవడం ఖాయమని ఒకప్పుడు దర్శక నిర్మాతలు ఆమెను ఓ రేంజ్ లో పొగిడారు.
అలా వైకుంఠపురంలో సినిమాలో నటించి విజయం అందుకోవటంతో చాలామంది దర్శక నిర్మాతలు ఈమెకు తమ సినిమాలలో బాగా అవకాశాలు అయితే ఇచ్చారు. అలా వరుసగా అవకాశాలు అందుకోగా ఇప్పుడు వరుసగా ప్లాప్ లు అందుకొని నిరాశ చెందింది. అది కూడా స్టార్ హీరోల సరసన నటించిన సినిమాలోనే ఫ్లాపులును ఎదుర్కొంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అలాగే రాధేశ్యామ్, ఆచార్య ఇలా వరుస సినిమాలు ఆమెను బాగా నిరాశపరిచాయి.

ఇక బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా వరుస సినిమాలు చేయగా అక్కడ కూడా ప్లాప్ లు అందుకుంది. దీంతో ఇప్పుడు విజయం కోసం బాగా ఎదురుచూస్తుంది. కానీ దర్శక నిర్మాతలు ఈమెను పక్కకు పెట్టేసారటా.. ఇకపై ఈమెకు అవకాశాలు కూడా రావడం కష్టమే అని తెలుస్తుంది.. తమ అభిమాన హీరోల సినిమాలు నిరాశపరిచినందుకు ఈమెపై బాగా ట్రోల్ చేయడం కూడా మొదలుపెట్టారు అభిమానులు.ఐరన్ లెగ్ అంటూ మరోసారి ఆమెకు ముద్రవేశారు. ఇక ఈ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ ను షేర్ చేస్తూ ఉంటుంది. తనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో కూడా ముచ్చట్లు కూడా పెడుతుంది..ఓ అభిమాని తనను ఫుల్ యాక్షన్ మూవీలో చూడాలి అని కోరిక ఉందని అనటంతో వెంటనే పూజ హెగ్డే త్వరలోనే చేస్తాను అని సమాధానం కూడా ఇచ్చింది. దీంతో ఆ స్టోరీ చూసి మరోసారి ట్రోల్ చేయడం మొదలుపెట్టారటా. ఇప్పటివరకు చేసిన యాక్షన్ చాలు.. ఇంకా ఫుల్ యాక్షన్ మూవీసా అంటూ.. దయచేసి ఇటువంటివి పనులు చేయకు అంటూ ఆమెను వేడుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: