తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారు ఇక ఇప్పుడు పెద్దవాళ్లుగా మారిపోయారు . కొంతమంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరో హీరోయిన్లుగా రాణిస్తూ ఉంటే.. ఇంకొంత మంది మాత్రం ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు అని చెప్పాలి. అయితే ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులకు సంబంధించి అప్డేటెడ్ ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఒకప్పుడు మేము చూసిన చిన్నారి చైల్డ్ ఆర్టిస్ట్ ఇంత పెద్దది అయిపోయిందా అని ఈ ఫోటోలు చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతూ ఉంటారు.



 ఇప్పుడు వెంకటేష్ సినిమాలో నటించిన ఒక చైల్డ్ ఆర్టిస్టుకు సంబంధించిన వార్త కూడా ఇలాగే హాట్ టాపిక్ గా మారిపోయింది. వెంకటేష్ నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మల్లీశ్వరి సినిమా కూడా ఒకటి. 2004లో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించి సూపర్ హిట్ సాధించింది. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ సంభాషణలు అందించారు. సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమాలో వెంకటేష్ అన్న కూతురుగా నటించిన చిన్నారి క్యూట్ క్యూట్ మాటలతో ప్రేక్షకుల మది దోచేసింది.


 మల్లీశ్వరి సినిమాలో నటించిన చిన్నారి పేరు గ్రీష్మ నేత్రి. తర్వాత కూడా పలు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు గ్రీష్మ మేత్రి పెద్దది అయిపోయింది. ఏకంగా హీరోయిన్ మెటీరియల్ లాగా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవల తన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. ఈ అమ్మడి ఫోటోలకి నేటిజన్స్ అందరూ కూడా ఫిదా అవుతున్నారు. ఒకప్పుడు మేము చూసిన చిన్నారి గ్రీష్మ నేనా ఇంత పెద్దది అయిపోయింది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి హీరోయిన్ల కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: