నెగిటివ్ పబ్లిసిటీ తో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అని నిరూపించాయి కొన్ని సినిమాలు. అయితే తాజాగా ఇప్పుడు సీనియర్ నటుడు నరేష్ కూడా ఇదే టెక్నిక్ ని ఫాలో అవుతున్నాడు అని చెప్పొచ్చు. మళ్లీ పెళ్లి అనే సినిమాతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు నరేష్. ప్రముఖ నటి పవిత్ర లోకేష్ తో ప్రేమాయణం పెళ్లి చేసుకోవడం వంటి సంఘటనలో రీసెంట్గా సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అయ్యారు. ఆ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో ఎంతటి దుమారాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇందుకుగాను నరేష్ మూడో భార్య రచ్చ రచ్చ చేస్తుంది.

అంతేకాదు కర్ణాటకలో వీళ్ళిద్దరూ ఒక రూమ్లో ఉన్నారన్న విషయాన్ని తెలుసుకొని వెంటనే అక్కడికి వెళ్లి నరేష్ని చెప్పుతో కొట్టే ప్రయత్నం చేసింది తన మూడో భార్య. వాటికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో విడుదలై ఎంతటి వైరల్ గా మారాయో మనందరికీ తెలిసిందే. ఇక తాజాగా వీళ్ళిద్దరూ కలిసి నటించిన మళ్లీ పెళ్లి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. అయితే ఈ ట్రైలర్ లో నరేష్ పవిత్రలకి సంబంధించిన అన్ని సంఘటనలు ఉన్నాయి. అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత వీళ్ళిద్దరి బయోపిక్ సినిమా లాగా తీసారన్న విషయం అర్థమవుతుంది.

దీంతో వీళ్ళిద్దరిపై సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో నెగిటివిటి వచ్చింది. అయితే ఆ నెగిటివిటి కాస్త ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది. అయితే ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్ లో నరేష్ ఈ సినిమాను నీకంగా 15 కోట్లతో తీశామంటే చెప్పాడు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి అంత ఖర్చు కాలేదు. ఈ సినిమా  కోసం 8 కోట్ల దాకా మాత్రమే  ఖర్చయిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. అయితే ఈ క్రమంలోనే ఈ సినిమా రైట్స్ నుండే 8 కోట్ల రూపాయలు వచ్చాయని థియేటర్స్ ద్వారా మనకు నాలుగు కోట్లు వచ్చాయని అంటున్నారు. విడుదల తర్వాత ఈ సినిమా కి ఎంత బిజినెస్ చేస్తుందో చూడాలి మరి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: