హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్నా కూడా ఇప్పటికీ అదే ఉత్సాహం తో సినిమాలలో నటిస్తున్నారు వెంకటేష్.

ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను తెరకెక్కించి ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు.వెంకటేష్ సినిమాలు రిలీజ్ అయితే ఆడవారు సినిమా థియేటర్లకు క్యూ కడుతూ ఉంటారు.

అందులోనూ ఫ్యామిలీ లే ఎక్కువగా సినిమా థియేటర్లకు వస్తూ ఉంటారు అని చెప్పవచ్చు. కానీ వెంకటేష్ ఇటీవల నటించిన వెబ్ సీరిస్ తో ఆ అంచనాలు మొత్తం కూడా రివర్స్ అయ్యాయి. రానానాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించిన భారీ స్థాయిలో విమర్శలను ఎదుర్కొన్నాడు వెంకటేష్.  బూతులు, వల్గారిటీ సన్నివేశాలు, సెక్స్ తప్ప ఇందులో ఏం లేదనేది మేజర్ ఆడియెన్స్ చెప్పుకొచ్చారు . అయినా దీన్ని యూత్ బాగా అయితే చూశారు. బోల్డ్ అండ్ హాట్ కంటెంట్ కావడంతో యూత్ దీన్ని బాగా చూసింది.

ముఖ్యంగా వెంకటేష్ బాగా ట్రోల్స్ కి గురయ్యారు. వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో ఇలాంటి బూతు సిరీస్ చేశాడా అనేది సినీ ప్రముఖులు, అభిమానులు బహిరంగంగానే ఆయనను విమర్శించారు. దీనిపై ఇటీవల వెంకటేష్ స్పందించి, అదొక ప్రయోగమని, కొత్త గా ప్రయత్నించామని, కొందరికి నచ్చింది, కొందరికి అయితే నచ్చలేదు. అందరి అభిప్రాయాలను గౌరవించాలని ఇప్పుడు వచ్చిన స్పందనని బట్టి తరువాత చేసే షోలో ఆ జాగ్రత్తలు తీసుకుంటామని, సీజన్ 2లో అది లేకుండా చూసుకుంటామని కూడా తెలిపారు వెంకీ. వెంకటేష్ ఈ బూతు ఇమేజ్ ని పోగొట్టి దాన్నుంచి బయటపడడానికి ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అందుకోసం మంచి జాతిరత్నంని పట్టారని తెలుస్తుంది..జాతిరత్నాలు చిత్ర దర్శకుడితో ఒక సినిమా చేయాలని ప్లాన్ కూడా చేస్తున్నారట. మంచి కామెడీ ఎంటర్టైనర్ చేయాలని అయితే అనుకుంటున్నారట. అనుదీప్తో ప్రస్తుతం చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: