వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా నిశ్చితార్థ వేడుక ఎంతో అంగరంగ వైభవం గా జరిగింది సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీ లను ఈ వేడుక కు ఆహ్వానించకపోయిన కేవలం మెగా అల్లు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక చాలా ఘనం గా జరిగిందని చెప్పాలి.ఈ విధంగా వీరిద్దరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం తో ఎంతోమంది అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇకపోతే వీరిద్దరూ గత కొద్దిరోజులు గా ప్రేమ లో మునిగి తేలుతున్న విషయం మనకు తెలిసిందే.

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి ప్రేమలో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియా లో వార్తలు వస్తున్న ఈ వార్తలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇలా తమ ప్రేమ గురించి వార్తలు వచ్చిన ప్రతిసారి తమ మధ్య అలాంటిదేమీ లేదంటూ చెప్పుకొచ్చారు. కట్ చేస్తే ఇద్దరి నిశ్చితార్థపు తేదీని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.ఇక ఈ నిశ్చితార్థపు ఫోటో లను వరుణ్ తేజ్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ నాకు ప్రేమ దొరికింది అంటూ ఈయన నిశ్చితార్థం ఫోటోలను షేర్ చేయగా లావణ్య త్రిపాఠి మాత్రం తమ ప్రేమ గురించి చెప్పుకొచ్చారు. తమ మధ్య 2016 వ సంవత్సరంలోనే ప్రేమ చిగురించిందని అయితే ఈ ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా ఇలాగే ఉండిపోతుంది అంటూ తన నిశ్చితార్థం ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం తో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.ఇలా తమ ప్రేమ 2016లో చిగురించిందని చెప్పడంతో ఆ సంవత్సరం లో వీరిద్దరూ శ్రీను వైట్ల దర్శకత్వంలో మిస్టర్  అనే సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. ఏది ఏమైనా నటి లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలు గా అడుగుపెట్టబోతున్నారని తెలియడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: