సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న కీర్తి సురేష్.. ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ బిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే.. అయితే గత కొంత కాలం నుంచి హిట్టు అనే పదానికి దూరమైన ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం వరుసగా విజయాలను ఖాతా లో వేసుకుంటూ దూసుకు పోతుంది. మొన్నటికి మొన్న నాని హీరోగా నటించిన దసరా సినిమా లో నాని సరసన హీరోయిన్గా నటించింది. వెన్నెల పాత్ర బాగా క్లిక్ అయింది అని చెప్పాలి. దీనితో కీర్తి సురేష్ కు మంచి గుర్తింపు కూడా వచ్చింది.


 అంతేకాదు ఈ సినిమా సూపర్ హిట్ గా కూడా నిలిచింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత  కోలీవుడ్ లో మామన్నాన్ అనే సినిమా ద్వారా మరో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ అమ్మడు. దీంతో కెరియర్ గ్రాఫ్ ఒక్క సారిగా పెరిగింది. ఇక మరి కొన్ని రోజుల్లో బాలీవుడ్లోకి కూడా అరంగేట్రం చేయబోతుంది అన్నది తెలుస్తుంది. తమిళ చిత్రం తేరి హిందీ రీమేక్ లో వరుణ్ ధావన్ సరసన నటించ బోతుంది కీర్తి సురేష్. ఈ క్రమంలోనే వరుస విజయాల తో జోరు మీద ఉన్న కీర్తి సురేష్ అటు భారీగా పారితోషకం పెంచింది అన్నది తెలుస్తుంది.


 మొన్నటి వరకు సినిమాకు రెండు కోట్లు మాత్రమే తీసుకున్న కీర్తి సురేష్.. తేరి సినిమా రీమేక్ కోసం మాత్రం మూడు కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటుందట. అదే సమయం లో దక్షిణాది చిత్రాలకు కూడా ఇదే డిమాండ్ చేయబోతున్నట్లు వినిపిస్తుంది. ఇక లేడీ ఓరియంటెడ్ సినిమాలను కూడా చేస్తూ అందులోనూ సక్సెస్ అవుతుంది అన్న విషయం తెలిసిందే. బోలా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తమిళంలో సైరాన్ రఘుతాత, రివాల్వర్ రిట,  కన్నవిడి సినిమాల్లో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: