మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఆశలు పెట్టుకొని మరి భోళా శంకర్ సినిమాలో నటించారు. ఈ సినిమా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా ఈ సినిమా విడుదలై ఫ్లాప్ గా నిలిచింది.. ముఖ్యంగా ఈ సినిమా రీమిక్స్ కావడం చేత మైనస్ గా మారింది. ముఖ్యంగా ఇందులో శ్రీముఖి సన్నివేశాలు అతిగా ఉండడం వల్ల ఈ సినిమా బోల్తా కొట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా రిజల్ట్ తర్వాత చిరంజీవి కాస్త వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది.. ముఖ్యంగా రీమిక్స్ సినిమా అంటే మరి ఇంతగా చిరంజీవి ఆలోచిస్తున్నారా అనే వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ఈ సినిమాకి ముందే.. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తో కలిసి ఒక మూవీని ఓకే చేశారు. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత చేయాలనుకున్నది.. భోళా శంకర్ సినిమా ఫ్లాప్ గా మిగలడంతో ఈ విషయంలో చిరంజీవి కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఎందుకంటే బ్రో డాడి అనే సినిమా రీమిక్స్ చేయాలనుకున్న.. భోళా శంకర్ సినిమా పరిస్థితి రావడంతో చిరంజీవిసినిమా ఇప్పుడు ఎందుకులేని ఆలోచనలో పడినట్లు సమాచారం.


అంతేకాకుండా నిర్మాతగా ఉన్న తన కుమార్తె కూడా నష్టపోవాల్సి వస్తుందని చిరంజీవి భావించి ఆచితూచి అడుగులు వేస్తున్నారు.. తన పుట్టినరోజు కూడా ఈ సినిమా నుంచి ఏ విధమైన అప్డేట్ కూడా ఇవ్వకపోవడం అందుకు కారణమని సమాచారం.. బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో యువ్వి క్రియేషన్ బ్యానర్ పైన ఒక సినిమాని నిర్మిస్తున్నారు.ఇక వశిష్ట తో తెరకెక్కిస్తున్న సినిమా చాలా భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా పైన అంచనాలు భారీగానే పెరిగిపోతున్నాయి.. మరి చివరికి చిరంజీవి ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తారేమో చూడాలి మరి.. ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఇండస్ట్రీలో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: