స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గత ఏడాది రిలీజ్ అయిన యానిమల్ సినిమాతో స్సెన్సేషన్ క్రియేట్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ మూవీ  ఏకంగా రూ.950 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయం అందుకుంది.సందీప్ రెడ్డి వంగా తన తరువాత సినిమా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‍తో చేయనున్నారు. ప్రభాస్ తో “స్పిరిట్”అనే పవర్ ఫుల్ మూవీ చేయనున్నారు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందీప్ స్పిరిట్ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు.స్పిరిట్ మూవీ స్క్రిప్ట్ గురించి సందీప్ రెడ్డి వంగా అప్‍డేట్ ఇచ్చారు. స్పిరిట్ మూవీ స్క్రిప్ట్ పనులు 60 శాతం పూర్తయ్యాయని గలాటా ప్లస్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ తెలిపారు.ఈ ఏడాది డిసెంబర్లో ఈ మూవీ షూటింగ్ మొదలవుతుందని తెలిపారు.

కరోనా సమయంలో ప్రభాస్ నుంచి తనకు ఓ సినిమా ఆఫర్ వచ్చిందని సందీప్ రెడ్డి వంగా తెలిపారు. యానిమల్ కంటే ముందే ఇది జరిగిందని సందీప్ అన్నారు. ప్రభాస్‍తో ఓ హాలీవుడ్ సినిమా రీమేక్ ఆఫర్ వచ్చిందని, తాను నో చెప్పానని, ఒరిజినల్ కథతోనే సినిమా చేద్దామని చెప్పినట్టు ఆయన తెలిపారు. ఆ తర్వాత ప్రభాస్‍కు స్పిరిట్ కథను చెప్పానని ఆయన వెల్లడించారు.ప్రస్తుతం ప్రభాస్  గ్లోబల్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో బిజీగా వున్నారు.నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ మే నెలలో విడుదల కానుంది. దీనితో పాటు ప్రభాస్ దర్శకుడు మారుతీతో రాజాసాబ్ చిత్రం చేస్తున్నారు.రాజాసాబ్ పూర్తయ్యాక.. సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ మొదలు పెట్టనున్నారు.డిసెంబర్‌లో స్పిరిట్ మూవీ షూటింగ్ మొదలవుతుందని సందీప్ తెలిపారు.. ఈ చిత్రంలో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా  నటించనున్నారు. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‍తో ఆ చిత్రం రూపొందుతుందని సందీప్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: