మాస్ మహారాజా రవితేజ హిట్ ... ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతున్న సమయం లోనే రవితేజ తన తదుపరి మూవీ లపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగా గత కొన్ని రోజులుగా రవితేజ భాను భోగవరపు దర్శకత్వంలో సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఓ మూవీ చేయబోతున్నట్లు అనేక వార్తలు వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. 

ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువబడింది. తాజాగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు రవితేజ కెరియర్ లో 75 వ మూవీ ని నిర్మించనున్నట్లు ... ఈ సినిమాకి భాను భాగవరపు దర్శకత్వం వహించబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ అఫిషియల్ గా ప్రకటించింది. అలాగే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు కూడా ఈ మూవీ యూనిట్ ప్రకటించింది.  

ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో  పేరు ... లక్ష్మణ్ బేరి ,  ఆదాయం ... చెప్పను తియ్ , రాజపూజం ... అన్లిమిటెడ్ , వ్యాయం లెక్కజయన్  , అవమానం ... జీరో అని రాసుకోచ్చారు.  ఇక ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన పోస్టర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఈ పోస్టర్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే రవితేజ ప్రస్తుతం నటిస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకొని రవితేజకు ఏ రేంజ్ క్రేజ్ ను అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt