తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన యువ నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించినప్పటికీ ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకొని అందులో చాలా మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఫుల్ క్రేజ్ కలిగిన హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

తాజాగా ఈ యువ నటుడు "ది ఫ్యామిలీ స్టార్" అనే సినిమాలో హీరోగా నటించాడు. మూవీ లో మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... పరుశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించగా ... గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ ఏప్రిల్ 5 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

దానితో ప్రస్తుతం ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలక్షన్ లు దక్కడం లేదు. ఈ మూవీ విడుదలకు ముందు జనాలు ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలో ఈ మూవీ కి భారీ ఎత్తున ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమాకి ప్రస్తుతం వస్తున్న కలెక్షన్ లను బట్టి చూస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ ను అందుకోవడం కష్టంగానే కనిపిస్తుంది.

ఇకపోతే ది ఫ్యామిలీ స్టార్ మూవీ పనులు ముగియడంతో విజయ్ తన తదుపరి మూవీ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. విజయ్ తన తదుపరి మూవీ ని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో  వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... తాజాగా "ప్రేమలు" సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ మమితా బైజూ ను ఈ మూవీ బృందం ఈ సినిమాలో హీరోయిన్ గా అనుకుంటున్నట్లు ... ఆల్మోస్ట్ ఈమెనే ఈ సినిమాలో హీరోయిన్ గా కన్ఫామ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd