తాజాగా మలయాళ ఇండస్ట్రీలో ఈ కేసు సంచలనం సృష్టిస్తోంది.మలయాళ బ్యూటీ హీరో విశాల్ రూమర్డ్ ప్రియురాలు అయినటువంటి ఈ హీరోయిన్ కిడ్నాప్ కేసులో ఇరుక్కుంది.ఇక ఆ నటి ఎవరయ్యా అంటే లక్ష్మీ మీనన్.. ఇంద్రుడు, కుంకి, చంద్రముఖి -2 వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న మలయాళ బ్యూటీ లక్ష్మీ మీనన్ తాజాగా కిడ్నాప్ కేసులో ఇరుక్కుంది. ఇక విషయంలోకి వెళ్తే.. కొచ్చిలోని ఓ రెస్టారెంట్ బార్ కి లక్ష్మీ మినన్ తన స్నేహితుడితో కలిసి వెళ్లింది. అయితే అక్కడికి ఓ ఐటీ ఉద్యోగి తన స్నేహితుడితో కలిసి వచ్చాడు. అలా బార్లో చిన్నపాటి గొడవ జరిగి ఆ ఐటి ఉద్యోగి ఫ్రెండ్ కి లక్ష్మీ మీనన్ ఫ్రెండ్స్ కి మధ్య గొడవలు తలెత్తాయి. ఆ తర్వాత కొంతమంది మధ్యలో కల్పించుకొని సర్ది చెప్పగా ఈ గొడవ అక్కడితో సర్ధుమణగలేదు.

లక్ష్మీ మీనన్ గ్యాంగ్ ఆ ఐటీ ఉద్యోగి వెళ్లే వాహనాన్ని వెంబడించి బలవంతంగా కారులో నుండి లాక్కొని తమ కారులో ఎక్కించుకొని ఆ ఐటీ ఉద్యోగిని చితక్కొట్టడమే కాకుండా ఈ విషయం ఎక్కడైనా చెబితే బాగుండదు అని బెదిరించారట.అయితే దెబ్బలు తిన్న ఆ ఐటి ఉద్యోగి ఎర్నాకులం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి లక్ష్మీ మీనన్ తో పాటు ఆమె ఫ్రెండ్స్ మీద కేసు నమోదు చేశాడు. అలా ఆదివారం అర్ధరాత్రి 11:45 నిమిషాలకి నన్ను వాళ్లు కొట్టారంటూ గాయాలని కూడా చూపించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు లక్ష్మీ మీనన్ తో ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ ని అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇప్పటివరకు లక్ష్మి మీనన్ ఆచూకీ మాత్రం తెలియలేదు.

కొంత మంది లక్ష్మీ మీనన్ పరారీలో ఉంది అని కిడ్నాప్ కేసులో ఇరుక్కుంది అనే విషయం తెలియగానే ఆమె ఎక్కడికో పారిపోయింది అని అంటున్నారు. ఇక ఈ విషయం బయటపడడంతో చాలామంది నెటిజెన్లు లక్ష్మీ మీనన్ వ్యక్తిత్వాన్ని నిందిస్తున్నారు. ఇదేమైనా సినిమా అనుకుందా.. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి మరీ కొట్టించడం ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక లక్ష్మీ మీనన్ చివరిగా శబ్దం అనే సినిమాలో కనిపించింది. అయితే ఈ హీరోయిన్ ఇంద్రుడు సినిమాలో చేసిన సమయంలో విశాల్ తో ప్రేమలో ఉందని వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు అనే రూమర్లు వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: