టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. సాధారణంగా ప్రైవేట్ వేడుకల్లో లేదా అవార్డ్ ఫంక్షన్లలో రకుల్ చాలా యాక్టివ్‌గా, అందరితో సరదాగా కనిపిస్తుంది. అయితే తాజాగా జరిగిన ఒక అవార్డ్స్ నైట్‌లో రకుల్‌కు ఒక వింత అనుభవం ఎదురైంది. స్టేజ్ మీద అవార్డ్ ఇస్తుండగా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఆమెను కనీసం పట్టించుకోకుండా, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా వెళ్లిపోవడం ఇప్పుడు నెట్టింట మంటలు పుట్టిస్తోంది.ఒక ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకలో ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ లక్షయ్ జగ్గీ అవార్డు అందుకోవడానికి స్టేజ్ మీదకు వచ్చారు. రకుల్ ప్రీత్ సింగ్ ఆయనకు ట్రోఫీని అందజేశారు. అయితే, అవార్డు అందుకున్న జగ్గీ.. రకుల్ వైపు కనీసం చూడకుండా, కనీస మర్యాదగా థాంక్స్ లేదా షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా గబగబా స్టేజ్ దిగి వెళ్లిపోయారు.


రకుల్ చేతులు చాచి షేక్ హ్యాండ్ ఇవ్వబోయినట్లు వీడియోలో కనిపిస్తుండగా, ఆమెను ఇగ్నోర్ చేయడంతో రకుల్ ఒక్క క్షణం అవాక్కయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు జగ్గీపై విరుచుకుపడ్డారు. "స్టార్ హీరోయిన్ అని కూడా చూడకుండా అంత అహంకారం ఏంటి?" అంటూ కామెంట్లతో రచ్చ చేశారు.విషయం ముదురుతుండటంతో లక్షయ్ జగ్గీ సోషల్ మీడియా వేదికగా స్పందించి తన వెర్షన్‌ను వినిపించారు."నాకంటే ముందు ఒక పెద్ద వయసు ఆవిడ అవార్డు తీసుకోవడానికి స్టేజ్ మీదకు వచ్చారు. ఆమె రకుల్‌కు చేయి చాపి షేక్ హ్యాండ్ ఇవ్వబోగా, రకుల్ ఆమెతో కరచాలనం చేయలేదు. అది నేను గమనించాను" అని జగ్గీ తెలిపారు.



"రకుల్ గారే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇష్టపడటం లేదేమో, అక్కడ ఆ పద్ధతి లేదేమో అనుకున్నాను. అందుకే నా వంతు వచ్చినప్పుడు నేను కేవలం అవార్డు తీసుకుని ముందుకు వెళ్ళిపోయాను. ఎవరినీ అవమానించాలనే ఉద్దేశ్యం నాకు లేదు" అని ఆయన వివరణ ఇచ్చారు.అంటే, రకుల్ అంతకుముందు చేసిన పనిని చూసి, తాను కూడా అలాగే ప్రవర్తించానని.. అది ఒక 'మిస్ అండర్‌స్టాండింగ్' మాత్రమే అని జగ్గీ చెప్పుకొచ్చారు.



ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి తర్వాత సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. త్వరలో ఆమె ఆయుష్మాన్ ఖురానా సరసన 'పతి పత్ని ఔర్ వో డో'అనే క్రేజీ ప్రాజెక్ట్‌లో కనిపించబోతోంది. ఈ సినిమా మే 15, 2026న విడుదల కానుంది. ఇక ఈ అవార్డు వివాదంపై రకుల్ ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా స్పందించలేదు.సినిమా ఇండస్ట్రీలో చిన్న విషయం కూడా ఒక్కోసారి పెద్ద వివాదానికి దారితీస్తుంది. జగ్గీ ఇచ్చిన క్లారిటీతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి. అయితే ఫ్యాన్స్ మాత్రం రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో చర్చలు జరుపుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: