ప్రపంచాన్ని కరోనా పట్టిపీడిస్తోంది..ఒకటి తరువాత ఒకటి అన్నట్టుగా అన్ని దేశాలపై తన పంజా విసురుతోంది. ఇప్పటి వరకూ సుమారు సుమారు 97 వేలమంది ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా చనిపోగా 16 లక్షల మంది పైగా ప్రజలు కరోన బారిన పడ్డారు. ఒక దేశం తరువాత మరొక దేశం పై దండయాత్ర చేస్తున్న కరోనా ప్రస్తుతం సింగపూర్ లో తన ప్రభావాని చూపిస్తోంది. కేవలం గంటల వ్యవధిలో వేలాది కేసులు సింగపూర్ లో నమోదు అవుతున్నాయి..ఇదిలాఉంటే

 

తాజాగా సింగపూర్ లో సుమారు 250 మంది భారతీయులు కరోన బారిన పడ్డట్టుగా ఇండియన్ హైకమిషన్ వెల్లడించింది. ఈ సంఖ్య అమాంతంగా పెరగడానికి గల కారణాలు అన్వేషించిన హై కమిషన్ అందుకు విదేశీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాలలో ఉన్న వారే అత్యధికంగా ఈ కరోన బారిన్ పడ్డట్టుగా తేల్చారు. హై కమిషన్ అధికారి జావేద్ అష్రఫ్ మాట్లాడుతూ. ఈ 250 మంది భారతీయుల్లలో కొందరు సింగపూర్ లోనే స్థిరపడిన భారత సంతతి వాళ్ళు కూడా ఉన్నారని తెలిపారు.

 

కరోన పాజిటివ్ వచ్చిన వారందరి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన వెల్లడించారు. కాగా వరల్డ్ ఒమీటర్ ఇన్ ఫోన్ లో ఇచ్చిన సమాచారం ప్రకారం సింగపూర్ లో ఇప్పటి వరకూ కరోనా కారణంగా సుమారు 2 వేల కేసులు నమోదు అయ్యాయని సుమారు 6 గురు మృతి చెందారని తెలిపారు. సింగపూర్ వివిధ కారణాల ద్వార వలస వెళ్ళిన వారిలో భారతీయులే అత్యధికంగా ఉన్నారని తెలుస్తోంది. అక్కడి తాజాగా పరిస్థితులపై ఎప్పటికప్పుడు హై కమిషన్ అలెర్ట్ గా ఉంటోందని బాధితులకి సత్వర సేవలు అందేలా చర్యలు తీసుకుంటోందని అంటున్నారు భారతీయులు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: