వాస్తవానికి గుజరాత్ నుంచి ఎక్కువ మంది వ్యాపార వేత్తలు ఉద్యోగస్తులు అమెరికా వెళ్లారు. అదే విధంగా రాజస్థాన్ దేశ రాజధాని ఢిల్లీ నుంచి కూడా ఎక్కువ మంది అమెరికా వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారందరూ కూడా ట్రంప్ కి భారీగా ఓట్లు వేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నుంచి కూడా చాలా మంది అమెరికా వెళ్లారు. వారందరూ కూడా ఇప్పుడు ట్రంప్ కి ఓటు వేసే అవకాశం ఉంది. వారిలో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. దీనితో జో బిడెన్ కి మోడీ హవా ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అని అక్కడి రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం అమెరికా లో ఎవరు గెలుస్తారు అనేది చెప్పటం చాలా వరకు కష్టంగానే ఉంది. అయితే జో బిడెన్ కి మాత్రం అమెరికన్ల నుంచి ఎక్కువగా మద్దతు వ’స్తోంది. అయితే ఇండియన్స్ కు మాత్రం అక్కడ ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండటం తో అసలు వారు ఎవరి వైపు మొగ్గుచూపుతారు ఏంటి అనేది చూడాలి. అయితే చాలా వరకు ఎన్నారైలు ట్రంప్ పై ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అనేది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి