అంతా అయోమయం.. అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో అని తెలియని భయం.. ఒకవైపు కరోనా చావులను తలచుకుంటే మనిషి బ్రతుకు మీద విరక్తి.. మరో వైపు దేశానికి పట్టిన దరిద్రం పాకిస్దాన్, చైనా.. వీటి పీడ ఎప్పుడు విరగడ అవుతుందో అనే ఆందోళన. ఇది చాలదన్నట్లుగా కన్నెర్ర చేసిన ప్రకృతి తన వరదలతో చేస్తున్న విధ్వంసం. ఇలాంటి టైంలో షాక్ అయ్యే వార్త..


అంత షాక్ అవుతుందా ఈ వార్త వింటే అని అనుకోకండి.. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు ఒంటి కన్ను రాక్షసుడు ఉండేవాడని కధల్లో చదువుకున్నాం.. అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది.. కాకపోతే ఒంటి కన్ను రాక్షసుడు కాదు. ఒంటికన్ను పిల్ల వాడు పుట్టాడట.. ఎక్కడో కాదు.. మన తెలంగాణాలోని మంచిర్యాలలో.. వింతగా పుట్టిన ఈ శిశువుకి ఒకే కన్ను ఉందట.


ఇదిలా ఉండగా ఈ మధ్య గద్వాలలో పుట్టిన ఓ శిశువుకు నోట్లో దంతాలు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తే, ఇప్పుడు ఏకంగా ఒంటి కన్ను శిశువు పుట్టడం.. అందులో కరోనాతో ప్రపంచం అంతా కిందమీద పడుతున్న వేళ.. మరి ఈ ఘటన దేనికి సంకేతమో ఆ భగవంతునికే తెలియాలి అంటున్నారట ఈ విషయం తెలిసిన పెద్దలు.. ఇకపోతే ఈ శిశువు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన శంకర్ ప్రియాంక దంపతులకు పుట్టాడట. అకస్మాత్తుగా ప్రియాంకకు పురిటి నొప్పులు రావడంతో 108లో లింగన్నపేట నుంచి చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తున్న సమయంలో ఆసుపత్రికి చేరుకునే లోపే ఈ శిశువు జన్మించిందట..


ఎంతో ఆనందంగా తమకు మగ బిడ్డ పుట్టాడని వారు అనుకుంటు ఉండగానే ఆ ఆనందం కన్నవారికి ఎక్కువ సేపు నిలువలేదు. ఇంతలో పుట్టిన శిశువు మృతి చెందాడని వైద్యులు దృవీకరించారు. ఇక ఆ కన్న తల్లిదండ్రుల రోదన ఆ భగవంతునికే తెలియాలి.. కాగా, ఆ వింత బాబును చూడటానికి స్థానికులు ఎగబడ్డారు.. ప్రస్తుతం లోకంలో జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తుంటే ఇంకా ముందు ముందు ఎన్ని వింతలు, దారుణాలు చూడవలసి వస్తుందో అనే సందేహం కొందరికైనా కలుగుతుందట..


మరింత సమాచారం తెలుసుకోండి: